TS News: తెరాస నేతలు పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వడం లేదు: సీఎల్పీ ఫిర్యాదు
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని సీఎల్పీ ఆరోపించింది. రాష్ట్రంలో ప్రజల ధన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని సీఎల్పీ ఆరోపించింది. రాష్ట్రంలో ప్రజల ధన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క తదితరులతో కూడిన బృందం గవర్నర్ను కలిసింది.
పోలీస్ వ్యవస్థ, శాంతిభద్రతలు, కొత్తగూడెం, నిజామాబాద్, మంథనిలో న్యాయవాదుల హత్య తదితర అంశాలను నేతలు తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. అధికార తెరాస నేతలు పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వడం లేదని సీఎల్పీ నేతలు గవర్నర్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీసుల నుంచి రక్షణ ఉంటుందనే భావనను ప్రజలు కోల్పోయారని.. పోలీస్ శాఖపై సమీక్ష నిర్వహించిన తగిన ఆదేశాలివ్వాలని గవర్నర్ను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ