నడిపేబండి.. జాగ్రత్తండి!
నగరంలో ఏటా 1800-2000కు పైగా వాహనాలు దొంగతనానికి గురవుతున్నాయి.వీటిలో ద్విచక్రవాహనాలే అధికం. రూ.20,000-2.5లక్షల వరకు ఖరీదైన ద్విచక్ర, రూ.2-90కోట్ల విలువైన కార్ల వరకూ చోరుల కన్నుపడి రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి.
గ్రేటర్లో ఏటా 2000కు పైగా వాహనాలు చోరీ
ఈనాడు, హైదరాబాద్ రాజేంద్రనగర్, న్యూస్టుడే: నగరంలో ఏటా 1800-2000కు పైగా వాహనాలు దొంగతనానికి గురవుతున్నాయి.వీటిలో ద్విచక్రవాహనాలే అధికం. రూ.20,000-2.5లక్షల వరకు ఖరీదైన ద్విచక్ర, రూ.2-90కోట్ల విలువైన కార్ల వరకూ చోరుల కన్నుపడి రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి. వీటిలో 40-55శాతం మాత్రమే పోలీసులు రికవరీ చేయగలుగుతున్నారు. ఫిర్యాదుచేస్తున్న వారిలో అధికశాతం వాహన బీమా రెన్యువల్ చేయక పూర్తిగా నష్టపోతున్నారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కొట్టేసేందుకు ఓ లెక్కుంది
* గుజరాత్కు చెందిన ఉమేశ్ ఖతిక్ ఇటీవల వరుసగా 5చోట్ల గొలుసు చోరీలకు పాల్పడ్డాడు. తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో వందలాది గొలుసు చోరీలు చేశాడు. ఆసిఫ్నగర్లో దొంగిలించిన స్కూటీనే ఐదుచోట్లవాడాడు.
* రాజస్థాన్కు చెందిన కరడుగట్టిన కార్ల దొంగ శైలేంద్రసింగ్ సక్సేనా. 10-12 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారు. ఖరీదైన కార్లను లక్ష్యంగా చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని దర్జాగా నడుపుకుంటూ వెళ్లిపోతాడు. రూ.కోటి ఖరీదైన కార్లు తప్ప మిగిలినవాటిని పట్టించుకోడు.
* నగరానికి చెందిన యువకుడు 45 స్పోర్ట్స్ బైక్లు దొంగిలించాడు. బాల్యం నుంచి వాటిపై మోజు పెంచుకున్న ఇతడు సరదా తీర్చుకునేందుకే చోరీల బాటపట్టాడు. పెట్రోల్ ఉన్నంత వరకూ చక్కర్లు కొట్టి వదిలేసి వెళ్లేవాడు.
వాహన దొంగతనాల్లో భిన్నకోణాలున్నాయి. యూపీ, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక నుంచి నగరానికి చేరే అంతరాష్ట్ర దొంగలు మొదట చేసేది వాహన చోరీలే. గృహ, గొలుసు దొంగతనాలు చేసి ఆ బండ్లను బస్టాండు, రైల్వేస్టేషన్, బహిరంగ ప్రదేశాల్లో వదిలేసి వెళ్లిపోతారు. ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న జాబితాలో జల్సాలకు అలవాటుపడిన యువకులు, అంతర్రాష్ట్ర దొంగలు అధికంగా ఉంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన దొంగలు హైదరాబాద్ చోరులతో స్నేహం చేసి కొట్టేసిన వాహనాలను తమ రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాల్లో విక్రయించి వాటాలుగా పంచుకుంటున్నారు. అక్కడైతే పోలీసుల తనిఖీలు ఉండవనే భరోసాతో అమ్మేస్తుంటారని గతేడాది లంగర్హౌస్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కళాశాలకు నడచి, బస్సులో వెళ్లటం ఇష్టంలేక బైక్లను దొంగిలించానని ఇటీవల నారాయణగూడ పోలీసులకు పట్టుబడిన నిందితుడు సమాధానమిచ్చాడు.
* ఇప్పుడే బండి బయటపెట్టి మద్యం దుకాణంలోకి వెళ్లా. బయటకొచ్చి చూడగానే కనిపించట్లేదు. చుట్టుపక్కల అడిగినా ఎవరూ మేం చూడలేదంటున్నారు. పత్రాలు, చరవాణులు కూడా అందులోనే ఉన్నాయి.
* అపార్ట్మెంట్ సెల్లార్ ఖాళీ లేకపోవటంతో ఇంటి ముందు బైక్ పార్క్ చేశా. నెలరోజుల క్రితమే రెండులక్షల రూపాయలు పోసి కొన్నా. మొదటినెల వాయిదా డబ్బులు కూడా కట్టలేదు. ఎలాగైనా మీరే నా బుల్లెట్ వెతికిపెట్టాలి.
ఆ రెండు చోట్లలోనే చోరీలెక్కువ
బి.గంగాధర్, ఏసీపీ, రాజేంద్రనగర్
ఎక్కువ శాతం వాహన దొంగతనాలు మార్కెట్లు, మద్యం దుకాణాల వద్దనే జరుగుతున్నాయి. ద్విచక్రవాహనాలకు పాతకాలం తాళాలు, ఏర్పాట్లు దొంగలకు మరింత అవకాశంగా మారాయి. ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నాం. వీటి వల్ల దొంగతనాలను అరికట్టడమే కాదు.. దొంగలనూ గుర్తిస్తున్నాం.
సరదా తీర్చుకునేందుకు చేస్తున్నారు
వెంకన్ననాయక్, ఏసీపీ, సీసీఎస్, మల్కాజిగిరి
బైక్లను దొంగిలిస్తున్న వారిలో ఆకతాయిలు ఎక్కువ. సరదా తీరగానే వదిలేసి వెళ్లిపోతున్నారు. చోరీ వాహనాలను కొనుగోలు చేస్తే జైలుకు వెళ్తామనే భయం ఉంది. అందుకే తక్కువ ధరకు ఇస్తామన్నా ఎవరూ ముందుకు రారు. కార్ల అద్దాలు పూర్తిగా మూసివేయాలి. యాంటీ థెప్ట్ డివైస్, జీపీఎస్ నేవిగేషన్ వంటి ఆధునిక పద్ధతులు అనుసరించాలి. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ తదితర పత్రాలు వాహనాల్లో ఉంచవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!