నచ్చేలా చేస్తామంటూ..నిండా ముంచేస్తారు!
ఏ ఒక్క అవకాశాన్నీ సైబర్ నేరస్థులు వదలట్లేదు. ప్రతి అంశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. కొత్త ఏడాది 20 రోజుల వ్యవధిలోనే వందల్లో ఫిర్యాదులు వచ్చాయి. గతంలో ఆన్లైన్ లాటరీలు, బహుమతులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, విదేశీ వివాహ సంబంధాలు అంటూ ఖాతాలో సొమ్ములు ఖాళీ చేసేవారు.
సేవల పేరుతో సైబర్ నేరస్థుల మోసాలు
ఈనాడు, హైదరాబాద్: ఏ ఒక్క అవకాశాన్నీ సైబర్ నేరస్థులు వదలట్లేదు. ప్రతి అంశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. కొత్త ఏడాది 20 రోజుల వ్యవధిలోనే వందల్లో ఫిర్యాదులు వచ్చాయి. గతంలో ఆన్లైన్ లాటరీలు, బహుమతులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, విదేశీ వివాహ సంబంధాలు అంటూ ఖాతాలో సొమ్ములు ఖాళీ చేసేవారు. గతేడాది పెట్టుబడులు, నగ్న చిత్రాల బెదిరింపులతో చెలరేగారు. ప్రస్తుతం మానవ వనరుల సేవలు అందిస్తామంటూ కొత్త పద్ధతిలో బరితెగిస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులే లక్ష్యంగా మాయగాళ్లు నయా ఎత్తులు వేస్తున్నారని, నకిలీ ఏజెన్సీలు, కన్సల్టింగ్ సంస్థల ముసుగులో తేలికగా డబ్బు కొట్టేస్తున్నారని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఫిర్యాదుకు ముందుకొచ్చేది కొందరే
నగరానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు. అంతర్జాలంలో ఓ అందమైన వెబ్సైట్ కనిపించింది. అందులో నంబరుకు ఫోన్చేసి వివాహ వేడుకకు అవసరమైన సేవల వివరాలు తెలుసుకున్నాడు. మరుసటిరోజు సదరు వ్యాపారిని వాట్సాప్ ఫోన్కాల్ ద్వారా ఏజెన్సీ నిర్వాహకుడు సంప్రదించాడు. అడ్వాన్స్ అంటూ రూ.50,000 వసూలు చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. మరోచోట పెళ్లి కూతురుకు మెహిందీ, వస్త్రాలంకరణతో ముస్తాబు చేస్తామంటూ బురిడీ కొట్టించి రూ.5000 ఆన్లైన్ ద్వారా జమ చేయించుకున్నారు. వివాహ వేళ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయామని బీహెచ్ఈఎల్కు చెందిన బాధితుడు ఆవేదన వెలిబుచ్చారు. రాజేంద్రనగర్కు చెందిన ఫొటోగ్రాఫర్.. ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తానంటూ రూ.15,000 అడ్వాన్స్గా తీసుకుని ముఖం చాటేశాడు. బాధితులు ఆరా తీసి, అతడు నగరంలోనే లేడని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా సొమ్ము పోగొట్టుకున్న వారిలో కొందరే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రూ.1000-3000 వరకు పోగొట్టుకున్నవారు ఫిర్యాదు చేయకపోవడం మాయగాళ్లకు అవకాశంగా మారింది.
ఏం చేస్తారంటే?
మహా నగరంలో కుటుంబం నడిపేందుకు ఆలుమగలిద్దరూ కొలువు చేయాల్సిన పరిస్థితి. ఇంటిపనుల నుంచి పచారీ సరకులు తీసుకొచ్చేంత వరకు పనివారిపైనే ఆధారపడుతున్నారు. దీన్ని మోసగాళ్లు అనువుగా మలుచుకుంటున్నారు. అందమైన వెబ్సైట్లు, ప్రకటనలతో.. అంతర్జాలంలో సేవల కోసం వెతికేవారిని ఆకట్టుకుంటున్నారు. ఇదంతా నిజమని భావించి ఫోన్ చేసిన వారిని తేలికగా బురిడీ కొట్టిస్తున్నారు. గృహానికి అవసరమైన వంట పని, ఇంటిపని, తోటపనులు చేసేవాళ్లను పంపుతామంటూ నమ్మకం కలిగిస్తారు. అడ్వాన్స్ అంటూ కొంత మొత్తం తీసుకుంటారు. తరువాత సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. ఇలాంటి నకిలీ ఏజెన్సీలు సమయం, సందర్భానికి అనుగుణంగా మోసాలకు పాల్పడటం విశేషం. లాక్డౌన్లో ఆన్లైన్ సేవల వినియోగం పెరిగింది. ప్రస్తుతం ఒమిక్రాన్ ఉద్ధృతితో మళ్లీ సేవల రంగానికి డిమాండ్ అధికమైంది. ఇదే అదనుగా నకిలీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని ఏసీపీ జి.శ్రీధర్ తెలిపారు. అన్ని వివరాలు నిర్ధారించుకోకుండా నగదు చెల్లించవద్దని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్