logo

అణగారిన వర్గాల హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షుడు మృతి

అణగారిన వర్గాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జవ్వాది సచ్చిదానంద్‌ (సత్యం) (64)గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన

Published : 27 Jan 2022 02:49 IST
సచ్చిదానంద్‌

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: అణగారిన వర్గాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జవ్వాది సచ్చిదానంద్‌ (సత్యం) (64)గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆయన చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గురువారం సచ్చిదానంద్‌ భౌతికగాయాన్ని బన్సీలాల్‌పేటలోని ఆయన నివాసంలో ఆయా పార్టీలు, సంఘాలకు చెందిన నేతలు సందర్శించి నివాళి అర్పించారు. ఉపసభాపతి టి.పద్మారావుగౌడ్‌, కార్పొరేటర్లు చీర సుచిత్ర, కే.హేమలత, షెడ్యులు కులాల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు సుదర్శన్‌బాబు, హెచ్‌యూజే నగర అధ్యక్షుడు ఈ.చంద్రశేఖర్‌తోపాటు ఆయా పార్టీలకు చెందిన నేతలు నివాళి అర్పించి సంతాపం తెలిపారు. గద్దర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంతోపాటు, ఆయా సామాజిక ఉద్యమాల కార్యక్రమాల నిర్వహణలో సచ్చిదానంద్‌ కీలకపాత్ర పోషించారన్నారు. ఒక పాదయాత్రలో 300, మరో పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్లు పాల్గొన్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని