భయమొద్దు..బతుకనిద్దాం!
కరోనాపై చాలావరకు అవగాహన వచ్చిన తరుణంలోనూ గర్భిణులను ఆసుపత్రిలో చేర్చుకోకుండా వెనక్కి పంపడం సరైంది కాదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేటలో కరోనా ఉందని నిండు గర్భిణిని ఆసుపత్రిలోకి చేర్చుకోకుండా నిరాకరించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.
క్లిష్ట పరిస్థితుల్లోనూ నిలోఫర్, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్సలు
ఇప్పటికే గాంధీలో వేల సంఖ్యలో కాన్పులు
ఈనాడు, హైదరాబాద్
కరోనాపై చాలావరకు అవగాహన వచ్చిన తరుణంలోనూ గర్భిణులను ఆసుపత్రిలో చేర్చుకోకుండా వెనక్కి పంపడం సరైంది కాదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేటలో కరోనా ఉందని నిండు గర్భిణిని ఆసుపత్రిలోకి చేర్చుకోకుండా నిరాకరించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ అయింది. గర్భిణులు, చిన్నారులకు వైద్యం అందించడంలో నిలోఫర్, గాంధీ ఆసుపత్రులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. తొలి, రెండో విడతల్లో కరోనా బారిన పడిన వేలాది మంది గర్భిణులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్సలు అందించారు. దాదాపు ఆరేడు వేల మందికి పురుడు పోశారు. గాంధీలో ఇటీవల కూడా 20-25 మందికి పురుడు పోసి తల్లీబిడ్డలను క్షేమంగా ఇళ్లకు పంపారు. నిలోఫర్లోనూ 15 మంది చిన్నారులు కొవిడ్తో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురికి ఇతర అనారోగ్య సమస్యలున్నాయని, అయినా అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
గర్భిణులకు ఈ జాగ్రత్తలు అవసరం
* గర్భిణులకు మొదటి నెల నుంచే ప్రత్యేక గది కేటాయించాలి. ఆహారం నుంచి వస్త్రాల వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
* అవకాశం ఉంటే ప్రత్యేక బాత్రూం కేటాయించాలి. వీలు కాకపోతే ఇతరులు ఉపయోగించిన తర్వాత శుభ్రం చేయాలి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు పంపక పోవడమే నయం. సీమంతం లాంటివి కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకోవడం ఉత్తమం.
* నెల వారీ పరీక్షలను వైద్యుల సూచనల మేరకు తగ్గించుకోవాలి. వీడియోకాల్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఇతర కుటుంబ సభ్యులంతా టీకాలు తీసుకోవాలి.
* 8, 9 నెలలు దాటిన తర్వాత అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్ సోకిన గర్భిణులను ఏ ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నారు.. ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి.. ముందే తెలుసుకోవాలి. స్థానిక వైద్యశాల ఏఎన్ఎం, వైద్యులు ఫోన్ నంబర్లు సేకరించి పెట్టుకోవాలి.
* నిలోఫర్, గాంధీలో 24 గంటలపాటు అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. కరోనా సోకిన వారికి సైతం ఇక్కడ ఉచితంగా చికిత్సలు అందిస్తారు. ఎంత క్లిష్టంగా ఉన్నా చేర్చుకుంటారు. గాంధీలో ఐసీయూ, ఆక్సిజన్ సదుపాయంతో ప్రత్యేక పడకలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
అప్రమత్తంగా ఉండాలి: - డాక్టర్ ఉషారాణి, చిన్న పిల్లల వైద్యులు, నిలోఫర్ ఆసుపత్రి
కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అనుబంధ అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లల్లో కరోనా ముప్పు ఎక్కువ. ప్రస్తుతం అలాంటి వారు నిలోఫర్లో 15 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్లో ఎక్కువ తీవ్రతతో కూడిన జ్వరం, వాంతులు, కడుపు నొప్పి, వీరేచనాలు అవుతున్నాయి. పిల్లలు నీరసించి పోతున్నారు. వెంటనే పరీక్షలు చేసి చికిత్స అందించాలి. ఒకట్రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోతోంది. ఈ సమయంలో ఎక్కువ ద్రవ పదార్థాలు అందించాలి. కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ లాంటివి తాగించడం వల్ల శరీరంలో పోటాషియం, సోడియం పోకుండా చూసుకోవచ్చు. గర్భిణుల్లో కరోనా లక్షణాలు కన్పిస్తే, నిలోఫర్ లేదా గాంధీలో చేర్పించవచ్చు. ఇప్పటికే ఇలాంటి వారికి చికిత్సలు అందించిన అనుభవం ఇక్కడి వైద్యులకు ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
[ 29-03-2024]
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంటిపన్నులు భయపెడుతున్నాయి. భువన్ సర్వే పేరుతో ఆస్తిపన్ను మదింపు చేయించిన మున్సిపల్ అధికారులు ఆ సర్వే ప్రకారం ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా పన్ను జారీ చేస్తున్నారు. -
బల్దియా హస్తగతం!
[ 29-03-2024]
గ్రేటర్లో పార్టీని బలోపేతం చేయడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో అనేక పురపాలక సంఘాలు, నగరపాలక సంఘాల పరిధిలో గత ఎన్నికల్లో భారాస అభ్యర్థులు గెలిచినా కూడా చాలా చోట్ల వీరంతా కాంగ్రెస్లో చేరుతున్నారు. -
భూ వినియోగ మార్పిడి దస్త్రాల్లో కదలిక
[ 29-03-2024]
ఎట్టకేలకు హెచ్ఎండీఏ పరిధిలోని భూ వినియోగ మార్పిడి(ల్యాండ్ యూజ్ కన్వర్షన్) దస్త్రాలకు మోక్షం లభించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆగిన ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
మూలికా వనం.. కబ్జాల పరం
[ 29-03-2024]
జవహర్నగర్ కార్పొరేషన్లో ప్రారంభించిన మూలికా వనం(హెర్బల్ గార్డెన్)ను ఆక్రమించేందుకు కొందరు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ వనంలో పదుల సంఖ్యలోనే మొక్కలుండగా, వాటి సంరక్షణనూ మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. -
రూ.44.68 కోట్ల లోటుతో ఉస్మానియా వర్సిటీ బడ్జెట్
[ 29-03-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కామర్స్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ అప్పారావు జమా ఖర్చులను గురువారం ప్రకటించారు. -
వైద్యుల చొరవతో ఏడేళ్లకు కుటుంబ సభ్యుల చెంతకు
[ 29-03-2024]
మానసిక సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాధితుడు ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం వైద్యుల చొరవతో ఏడేళ్ల తరువాత కుటుంబ సభ్యుల చెంతకు చేరారు. -
సన్నని ధార...చాలని సరఫరా
[ 29-03-2024]
ఒకవైపు గ్రేటర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోగా.. జలమండలి అరకొర నీటి సరఫరా...అందులో తక్కువ ఒత్తిడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
24 గంటలూ.. ట్యాంకర్లతో నీటి సరఫరా
[ 29-03-2024]
వచ్చేనెల మొదటి వారం నుంచి గ్రేటర్వ్యాప్తంగా 24 గంటలపాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ తెలిపారు. ఇందుకు అదనంగా 250 ట్యాంకర్లు, 24 ఫిల్లింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. -
నిబంధన ఎగ్గొట్టి.. రసాయనంతో మగ్గబెట్టి
[ 29-03-2024]
మధురఫలంగా పేరుగాంచిన మామిడి పండుపైన రసాయనక మరక పడుతోంది. ఇష్టానుసారం కార్బైడ్, ఇథలిన్ రసాయనాలు విచ్చలవిడిగా వినియోగించి మగ్గబెట్టేస్తున్నారు. ఇటీవల టాస్క్ఫోర్సు పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి రూ.12లక్షల విలువైన మామిడికాయలను పట్టుకున్నారు. -
పైసలు కాదు.. ప్రయాణమే ముఖ్యం
[ 29-03-2024]
ఇరవై కిలోమీటర్ల సిటీ బస్సు ప్రయాణానికి రూ.35.. 20 కిలోమీటర్ల మెట్రో ప్రయాణానికి రూ.50 వసూలు చేస్తున్నారు.. 20 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ ప్రయాణానికి కేవలం రూ.5 మాత్రమే. బస్సులో గంటలకొద్దీ ప్రయాణ సమయం పడుతున్నా.. -
నిప్పు పొంచి ఉన్న ముప్పు
[ 29-03-2024]
భానుడి భగభగలకు నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. గురువారం ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలకు చేరుకుంది. మున్ముందు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మండే ఎండలకు తోడు తేమ శాతం తగ్గి అగ్నిప్రమాదాలు పెరుగుతున్నాయి. -
రూ.3 కోట్ల వజ్రం రూ.30లక్షలకే అంటూ మోసానికి యత్నం
[ 29-03-2024]
రూ.కోట్ల విలువైన వజ్రాన్ని రూ.లక్షలకే విక్రయిస్తామని ప్రజలను నమ్మిస్తున్న ముఠాను హబీబ్నగర్ పోలీసులు అరెస్ట్చేశారు. సౌత్వెస్ట్ డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి కథనం ప్రకారం.. ముంబాయి, ఠాగూర్నగర్ విక్రిల్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన బాలచంద్ర తులేరే (48) మూడురోజుల క్రితం నగరానికి వచ్చాడు. -
బిస్కెట్ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
[ 29-03-2024]
కాటేదాన్ పారిశ్రామికవాడలోని పహల్ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, పరిశ్రమ మేనేజర్ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. -
కార్ల గోదాంలో మంటలు.. ఆరు వాహనాలు దగ్ధం
[ 29-03-2024]
గండిపేట మండలం ఖానాపూర్ సమీపంలోని ఓ కార్ల గోదాంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మరమ్మతులకు గురైన వాహనాలు ఆహుతయ్యాయి. నగరానికి చెందిన ఓ వ్యాపారి మరమ్మతులకు గురయిన కార్లను ఖానాపూర్ సమీపంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచారు. -
చేయి లేకున్నా.. సైకిల్ యాత్ర
[ 29-03-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న సైక్లిస్టు తమిళనాడుకు చెందిన బి.తమీమ్ అన్సారీ. 2003లో తాను పనిచేసే కర్మాగారంలో ప్రమాదవశాత్తూ కుడి చేతిని కోల్పోయారు. ఆ సమయంలో చికిత్సకు ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు తోడవటంతో ప్రమాద బీమా వంటివి లేక ఆవస్థలు పడ్డారు. -
ప్రత్యర్థులు వారే... పార్టీలు వేరే
[ 29-03-2024]
ఐదేళ్ల కిందట లోక్సభ ఎన్నికల్లో వారిద్దరూ ప్రత్యర్థులు.. ఒకరు భారాస అభ్యర్థిగా నామినేషన్ వేస్తే, మరొకరు భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి పోటీ పడ్డారు. హోరాహోరీ పోరులో భారాస అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి 14వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. -
ఉప్పల్లో సినీ నటి నిధి అగర్వాల్ సందడి
[ 29-03-2024]
40 ఏళ్లుగా వస్త్ర వ్యాపార రంగంలో తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా సీఎంఆర్ వస్త్ర దుకాణం నిలిచిందని సినీతార నిధి అగర్వాల్ కొనియాడారు. -
ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకుగాను 1,437 ఓట్లు పోలయ్యాయి. ఓటేసిన వాళ్లలో 19 మంది ఎక్స్అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. -
రంజాన్ జోష్.. అత్తర్లకు క్రేజ్
[ 29-03-2024]
రంజాన్ నేపథ్యంలో పాతనగరంలో అత్తర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్య పండగలు, పెళ్లిళ్ల సీజన్లలో అత్తర్కు గిరాకీ ఎక్కువగా ఉన్నా.. రంజాన్ మాసంలో అనేక రకాల ఫ్లేవర్లకు డిమాండ్ అధికంగా ఉంటోంది. -
కొడంగల్ వృద్ధితోనే.. ఉపాధి అవకాశాలు సమృద్ధి: టీఆర్ఆర్
[ 29-03-2024]
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ను అభివృద్ధి చేస్తున్నారు. ఆ ప్రభావం పరిగి, తాండూర్, పాలమూరు మీద పడి అవి కూడా పురోగమించి మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని’ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి శాసన సభ్యులు రామ్మోహన్రెడ్డి అన్నారు. -
‘భారాస విజయానికి కృషి చేద్దాం’
[ 29-03-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో భారాస తప్పక విజయం సాధిస్తుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ విజయం సాధించేందుకు కార్యకర్తలు, నాయకులు గట్టిగా కృషి చేయాలని చెప్పారు. -
మోదీ పాలనతోనే గ్రామాల్లో మార్పు: కొండా
[ 29-03-2024]
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అనేక రకాలుగా మార్పు వచ్చిందని చేవెళ్ల పార్లమెంట్ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం మిట్టకంకల్, కడ్మూరు, మేడిపల్లి కలాన్ గ్రామాల్లో పర్యటించారు. -
మహమ్మారిపై అప్రమత్తత అవసరం
[ 29-03-2024]
ప్రమాదకర ఎయిడ్స్పై అప్రమత్తత అవసరమని, ఎయిడ్స్పై సందేహాలు ఉన్నవారు ఉచిత హెల్ప్లైన్ నంబరు 1097ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ జీవరాజ్ అన్నారు. -
బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఏ ఒక్క ఓటూ చేజారిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకుగాను 1,437 ఓట్లు పోలయ్యాయి. -
ఇసుక అక్రమ నిల్వ.. అదనుచూసి విక్రయం
[ 29-03-2024]
తాండూరు పరిసరాల్లోని కాగ్నా, కాకర వేణి నదుల నుంచి కొల్లగొడుతున్న ఇసుకను అక్రమార్కులు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. నదుల్లో అనుమతుల పేరిట తవ్వకాలు ఆగిపోయినపుడు నిల్వ చేసిన ఇసుకను డిమాండును బట్టి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
[ 29-03-2024]
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత