TS News: టోనీని రేపటి నుంచి కస్టడీలోకి తీసుకుంటాం: డీసీపీ జోయల్‌ డేవిస్‌

పంజాగుట్ట మాదకద్రవ్యాల కేసులో పరారీలో ఉన్న నలుగురు వ్యాపారుల కోసం గాలింపు నిర్వహిస్తు్న్నామని

Updated : 28 Jan 2022 13:08 IST

హైదరాబాద్‌: పంజాగుట్ట మాదకద్రవ్యాల కేసులో పరారీలో ఉన్న నలుగురు వ్యాపారుల కోసం గాలింపు నిర్వహిస్తున్నామని హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ప్రధాన నిందితుడు టోనీని రేపటి నుంచి కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో రేపు టోనీని ప్రశ్నిస్తామని.. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. రేపటి నుంచి ఫిబ్రవరి 2 వరకు విచారణ నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చిందని చెప్పారు. డ్రగ్స్‌ కేసులో చంచల్‌గూడ జైల్లో ఖైదీలుగా ఉన్న వ్యాపారులను కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని డీసీపీ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని