logo

సంపులో పడి ఏడేళ్ల బాలిక దుర్మరణం

ఓ భవనం వద్ద సంపు కోసం తవ్విన గుంతలో పడి ఏడేళ్ల బాలిక దుర్మరణం పాలైన ఘటన సైదాబాద్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..

Published : 29 Jan 2022 03:06 IST


శివాని

సైదాబాద్‌, న్యూస్‌టుడే: ఓ భవనం వద్ద సంపు కోసం తవ్విన గుంతలో పడి ఏడేళ్ల బాలిక దుర్మరణం పాలైన ఘటన సైదాబాద్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ శ్రీలక్ష్మీనగర్‌ కాలనీలోని కో-ఆపరేటివ్‌ సొసైటీ భవనం వద్ద బహుళ అంతస్తుల గృహ సముదాయం నిర్మాణం చేపట్టేందుకు ఓ ప్రైవేటు సంస్థ పనులు చేపట్టింది. నారాయణఖేడ్‌లోని చుక్కల తీర్థం ప్రాంతానికి చెందిన బాలాజీ, సోనాబాయి దంపతులు జీవనోపాధికి నగరానికి వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండు నెలల క్రితం బాలాజీ పనులు చేపడుతున్న ప్రదేశంలో కాపలాదారుడిగా చేరాడు. సదరు భవనం వద్ద సంపు కోసం భారీ గుంత తవ్వారు. ఇటీవల బోరు వేయడంతో నీళ్లన్నీ ఆ గుంతలోకి చేరాయి. శుక్రవారం బాలాజీ కుమార్తె శివాని (7) ఆడుకుంటూ నీటితో నిండిన సంపులో పడింది. బాలిక కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ గుంతలో చూడగా.. అప్పటికే బాలిక మృతి చెంది ఉండడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సై శాంతికుమార్‌ ఘటనాస్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని