ముగ్గులోకి దించి.. మత్తులో ముంచి!
నగరంతో దేశ, విదేశాలకు రవాణాసౌకర్యాలు అందుబాటులో ఉండటం, రాకపోకలు సాగించేందుకు అనుకూల వాతావరణం ఇవన్నీ మత్తురవాణాకు కలసివస్తున్నాయి. గతేడాది ప్రభుత్వం మత్తుపదార్థాల కట్టడిపై పోలీసు, ఎక్సైజ్శాఖలకు ఆదేశాలు ఇచ్చేంత
దేశం నలువైపులా నుంచి నగరానికి మాదకద్రవ్యాలు
గ్రేటర్ పరిధిలో వందలాది మంది ఏజెంట్లు
ఈనాడు, హైదరాబాద్
ఏవోబీ; గంజాయి, రాజస్థాన్; నల్లమందు, గోవా; ఎల్ఎస్డీ బ్లాట్స్, ఎండీఎంఏ, పశ్చిమబెంగాల్; హెరాయిన్, తాజాగా పంజాబ్ నుంచి గసగసాల గడ్డి
- దేశం నలువైపుల నుంచి హైదరాబాద్ నగరానికి చేరుతోన్న మాదకద్రవ్యాల జాబితా ఇది.
నగరంతో దేశ, విదేశాలకు రవాణాసౌకర్యాలు అందుబాటులో ఉండటం, రాకపోకలు సాగించేందుకు అనుకూల వాతావరణం ఇవన్నీ మత్తురవాణాకు కలసివస్తున్నాయి. గతేడాది ప్రభుత్వం మత్తుపదార్థాల కట్టడిపై పోలీసు, ఎక్సైజ్శాఖలకు ఆదేశాలు ఇచ్చేంత వరకూ స్మగ్లర్లు యథేచ్ఛగా లావాదేవీలు నిర్వహించారు. ప్రస్తుతం పోలీసుల ముమ్మర తనిఖీలతో సామాజిక మాధ్యమాలు, డార్క్నెట్ వంటి వాటిని లావాదేవీలకు అనువుగా మలచుకున్నారు.
బాధితులే విక్రేతలుగా మారి..
చదువు, వ్యాపారం, పర్యాటక వీసాలపై భారత్ చేరిన నైజీరియన్లు ఈ మొత్తం రాకెట్లో అసలు సూత్రధారులు. పబ్ల్లో ఏర్పడిన పరిచయాలతో విక్రయాలు జరుపుతున్నారు. కొందరు పబ్ల నిర్వాహకులు ప్రధాన ఏజెంట్లుగా పనిచేస్తూ కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. బేగంపేజ్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోని మూడు పబ్లు యువతను ఆకర్షించేందుకు డే/నైట్ పార్టీల్లో ఎల్ఎస్డీ ఉచితంగా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. పబ్లు, బార్అండ్ రెస్టారెంట్లు, దాబాలు, వ్యాయామ కేంద్రాలు, మ్యూజిక్/థీమ్ పార్టీల వేదికలు మత్తుపదార్థాలు విక్రయించే ఏజెంట్లకు అనుకూల ప్రాంతాలు. జిమ్ల్లో ఊబకాయం/అధికబరువుతో ఉన్న యువకులు వీరి లక్ష్యం. వ్యాయామ శిక్షకుల సూచనతో బరువు తగ్గేందుకు తమ వద్ద పౌడరు ఉందంటూ తక్కువ మోతాదులో ఎండీఎంఏ అలవాటు చేస్తారు. దాని ప్రభావంతో ఆకలి తగ్గటం, ఎక్కువ సమయం వ్యాయామం చేసేందుకు అవసరమైన శక్తి రావటంతో వినియోగించిన వారు కూడా నమ్ముతున్నారు. ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు తీసుకుంటూ క్రమంగా బానిసలవుతున్నారు. సరుకు కొనేందుకు సొమ్ముల్లేక మత్తుపదార్థాలు విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. ఏజెంట్ల వద్ద సబ్ఏజెంట్లుగా పనిచేస్తూ మాదకద్రవ్యాలను కొనుగోలుదారులకు(పెడ్లర్స్)కు అందజేసి కమీషన్ తీసుకుంటున్నారు. ఇటీవల పోలీసు, అబ్కారీ అధికారులు అరెస్ట్ చేస్తున్న వారిలో అధికశాతం ఈ జాబితాలోని వారే ఉంటున్నారు. చెడుస్నేహాలు, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వంటి కారణాలతోనే ఎక్కువ మంది యువకులు మత్తుకు బానిసలవుతున్నారని ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెంండెంట్ కె.నవీన్కుమార్ తెలిపారు.
విలాసవంతమైన జీవితం..
మాదకద్రవ్యాలు ఎక్కడ నుంచి వస్తాయి? అసలు వ్యక్తి ఎవరు? అనేది అత్యంత రహస్యంగా ఉంచుతారు. గోవా, ముంబయి, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి హెరాయిన్, కొకైన్, ఎండీఎంఏ కొనుగోలు చేసిన దళారులు ఏజెంట్లు, సబ్ఏజెంట్లు, కొరియర్/డెలివరీ బాయ్స్ ద్వారానే మత్తుపదార్థాలను చేరవేస్తుంటారు. వాట్సాప్, ఇన్స్టాగ్రూపుల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఇదే వృత్తిగా కొనసాగించే ఒక్కో ఏజెంట్ నెలకు రూ.60,000-70,000, సబ్ ఏజెంట్లు రూ.25,000 వరకూ సంపాదిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సౌకర్యవంతమైన భవనాలు, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసి విలాసవంతంగా జీవిస్తుంటారని తెలుస్తోంది. ఇటీవల కేపీహెచ్బీ, టోలిచౌకి వద్ద ఎక్సైజ్ అధికారులు మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మత్తుపదార్థాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ముతోనే కొనుగోలు చేసినట్టు గుర్తించారు. గతేడాది కూకట్పల్లిలో అరెస్టయిన మాదకద్రవ్యాల విక్రేత కొత్తగా కొనుగోలు చేసిన కారు ధర అక్షరాలా రూ.90లక్షలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
[ 18-04-2024]
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
[ 18-04-2024]
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
[ 18-04-2024]
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ