మీరు కొనే స్వర్ణం.. ఎంత స్వచ్ఛం?
అక్షయ తృతీయ అంటేనే ఓ సెంటిమెంటు! గ్రామో, కాసో, తులమో.. ఇలా ప్రజలు తమ స్తోమతకు తగ్గట్టుగా బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం బంగారం ధర ఎక్కువగా ఉంది.
నాణ్యత తక్షణ నిర్ధరణకు బీఐఎస్ కేర్ యాప్
హాల్మార్కు చూసి కొనాలంటున్న నిపుణులు
ఏటా రెండు టన్నుల మేర విక్రయాలు
నేడే అక్షయ తృతీయ
ఈనాడు, హైదరాబాద్ : అక్షయ తృతీయ అంటేనే ఓ సెంటిమెంటు! గ్రామో, కాసో, తులమో.. ఇలా ప్రజలు తమ స్తోమతకు తగ్గట్టుగా బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం బంగారం ధర ఎక్కువగా ఉంది. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల ధర రూ.52,910గా ఉంది. ఎంతో ఖర్చు పెట్టి కొనుగోలు చేసేప్పుడు.. ఏమాత్రం ఏమరుపాటు లేకుండా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. హాల్ మార్కు ఉన్న ఆభరణాలే కొనాలని సూచిస్తున్నారు. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ధ్రువీకరించిన హాల్ మార్కు ముద్ర ఉంటేనే నాణ్యమైన బంగారంగా గుర్తించాలని చెబుతున్నారు. నేడు అక్షయ తృతీయ సందర్భంగా ‘ఈనాడు’ ప్రత్యేక కథనం...
క్షణాల్లో తేల్చేయొచ్చు!.. మనం కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ ముద్ర, బంగారు ఆభరణాలకు భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) హాల్ మార్కును అందిస్తోంది. ఐఎస్ఐ ముద్రతోపాటు ప్రతి తయారీదారుకు లైసెన్సును అందిస్తోంది. వీటన్నింటినీ వినియోగదారులు సులువుగా పరీక్షించుకుని, వస్తువుల నాణ్యతను నిర్ధారించుకునేందుకు బీఐఎస్ కేర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నగల దుకాణానికి వెళ్లినప్పుడు వినియోగదారులు ప్రతి నగపై ముద్రించే హాల్ మార్కు లోగో, హాల్ మార్కు యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్యూఐడీ) సంఖ్య గమనించాలి. యాప్లో ఉన్న వెరిఫై హెచ్యూఐడీ విభాగంలో ఈ నంబరుతో.. ఆభరణం తయారీ, నాణ్యతకు సంబంధించి అన్ని వివరాలు ఇట్టే తెలిసిపోతాయి.
ఏంటీ హాల్ మార్కింగ్?.. వినియోగదారులకు స్వచ్ఛ బంగారం చేర్చడం, పునర్ విక్రయ అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్ 23 నుంచి హాల్మార్కింగ్ తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఉండగా.. .. వచ్చే నెల నుంచి మరిన్ని జిల్లాల్లో అందుబాటులోకి రానున్నాయి.
నగలపై ఇవి ఉన్నాయా?
1. బీఐఎస్ ముద్ర 2. బంగారం నాణ్యత 3. హెచ్యూఐడీ నంబరు (హాల్మార్కు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబరు)
పండగపైనే ఆశలు
ఈ ఏడాది అక్షయ తృతీయకు దేశవ్యాప్తంగా దాదాపు 25-30 టన్నుల బంగారు ఆభరణాలు అమ్ముడవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2019లో ఇది 23 టన్నులు ఉండగా, 2020లో కొవిడ్ కారణంగా కొనుగోళ్లు పెద్దగా లేవు. గతేడాది 2021లో 20శాతం పెరగ్గా.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వేడుకలు కలిసి రావడంతో కొనుగోళ్లు భారీగా జరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగర మార్కెట్లో ఏటా అక్షయ తృతీయ ఒక్కరోజే టన్ను వరకు బంగారు ఆభరణాలు అమ్ముడవుతాయని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా మరో టన్ను మేర అమ్మకాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
మార్కెట్లో ఎక్కువగా 14, 18, 22 క్యారెట్ల బంగారమే ఆభరణాలకు వినియోగిస్తారు. వాటిపై కోడ్ 22కే916, 14కే585 అని ముద్రించి ఉంటుంది.
‘మార్కు’ ఉండాల్సిందే
- కేవీ రావు, డైరెక్టర్, బీఐఎస్ హైదరాబాద్ శాఖ
అభరణాలు కొనేప్పుడు ముందుగా హాల్మార్కు ఉందా.. లేదా తప్పకుండా పరిశీలించాలి. అందుబాటులో ఉన్న హాల్మార్కు కేంద్రాలలో రూ.45 చెల్లించి నగల నాణ్యత తెలుసుకోవచ్ఛు వర్తకుల వద్ద కొనేముందు బీఐఎస్ కేర్ యాప్ వినియోగించి నాణ్యత గుర్తించవచ్ఛు వస్తువుల నాణ్యత, శుద్ధత విషయంలో ఎలాంటి అనుమానాలున్నా, బీఐఎస్ హైదరాబాద్ విభాగాన్ని సంప్రదించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.