పరీక్షలు రాయకుండానే ఇంజినీరింగ్, డిగ్రీ పట్టాలు
విద్యార్హతలు లేకుండా, పరీక్షలు రాయకుండా ఇంజినీరింగ్.. డిగ్రీ పట్టాలు ఇస్తున్న వ్యవహారంలో భోపాల్లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఎం.సి.ప్రశాంత్ పిళ్లై, మాజీ ఉపకులపతి డాక్టర్ ఎస్.ఎస్. కుష్వాలను గురువారం అరెస్ట్
ఎస్ఆర్కే వర్సిటీ వైస్ ఛాన్సలర్ అరెస్ట్
మాజీ వైస్ ఛాన్సలర్ ఎస్.ఎస్.కుష్వానూ అరెస్ట్ చేసిన పోలీసులు
భోపాల్, ఇండోర్లలో మరింతమంది నిందితుల కోసం వేట
ఈనాడు, హైదరాబాద్
విద్యార్హతలు లేకుండా, పరీక్షలు రాయకుండా ఇంజినీరింగ్.. డిగ్రీ పట్టాలు ఇస్తున్న వ్యవహారంలో భోపాల్లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఎం.సి.ప్రశాంత్ పిళ్లై, మాజీ ఉపకులపతి డాక్టర్ ఎస్.ఎస్. కుష్వాలను గురువారం అరెస్ట్ చేశామని హైదరాబాద్ అదనపు సీపీ(నేర పరిశోధన)ఎ.ఆర్.శ్రీనివాస్ తెలిపారు. విద్యార్హతలు లేని వారికి డిగ్రీ సర్టిఫికెట్లను, విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన ఇంజినీరింగ్ పట్టాలను ఎస్ఆర్కే యూనివర్సిటీ పేరుతో జారీ చేస్తున్నారని వివరించారు. డిగ్రీకి రూ.2లక్షలు, ఇంజినీరింగ్కు రూ.2.5లక్షల నుంచి రూ.4లక్షలు వసూలు చేసుకుంటున్నారు. ఈ అక్రమాల్లో డాక్టర్ ప్రశాంత్ పిళ్లై, ఎస్.ఎస్.కుష్వాలకు ప్రమేయం ఉందని ఆధారాలు లభించడంతో భోపాల్కు వెళ్లిన పోలీసులు వారిద్దరినీ మంగళవారం అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఐదేళ్ల నుంచి వీరు అక్రమాలకు పాల్పడుతున్నారని, మరికొంతమంది వర్సిటీ అధికారులకూ ఈ నేరంతో సంబంధం ఉండడంతో వారిని అరెస్ట్ చేసేందుకు భోపాల్, ఇండోర్ నగరాల్లో ప్రత్యేక బృందాలు పరిశోధన కొనసాగిస్తున్నాయని వివరించారు.
అక్రమాలు.. కన్సల్టెన్సీలకు కమీషన్లు
భోపాల్లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్ ప్రభుత్వం, యూజీసీల నుంచి ప్రైవేటు యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పెంచుకునేందుకు వర్సిటీ యాజమాన్యం, వర్సిటీ అధికారులు ఐదేళ్ల క్రితం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి, దిల్లీలో ఉంటున్న కన్సల్టెన్సీల ప్రతినిధులను కలుసుకున్నారు. యూనివర్సిటీకి రాకుండానే, పరీక్షలు రాయకుండానే డిగ్రీ, ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు ఇస్తామంటూ చెప్పారు. తమకు యాభైశాతం ఇస్తే.. మీరు యాభై శాతం తీసుకోండంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటి నుంచి కన్సల్టెన్సీల ప్రతినిధులు, ఎస్ఆర్కే వర్సిటీ అధికారులు రూ.లక్షలు తీసుకుని వందలమందికి ఇంజినీరింగ్, డిగ్రీ, ఏంబీఏ, పట్టాలను జారీ చేశారు. మూడునెలల క్రితం నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారన్న ఆరోపణలపై హైదరాబద్ పోలీసులు మలక్పేట్లో ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడిని అరెస్ట్ చేయగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్కే వర్సిటీ అధికారి కేతన్ సింగ్ పేరు బయటకు రావడం, అతడిని అరెస్ట్ చేయడంతో విశ్వవిద్యాలయంలో ఉపకులపతి వరకూ ప్రమేయం ఉందని తేలింది. వీటికి సంబంధించి పక్కా సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించి ఉప కులపతి, మాజీ ఉప కులపతులను అరెస్ట్ చేశారు.
వైద్య నిపుణులు.. దారి తప్పారు
సర్వేపల్లి రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయం కులపతి ప్రశాంత్ పిళ్లై, మాజీ వీసీ ఎస్.ఎస్.కుష్వా ఇద్దరూ వైద్య నిపుణులే. 2017 నుంచి నాలుగేళ్లు ఉప కులపతిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ ఎస్.ఎస్.కుష్వా మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్నత పదవుల్లో పనిచేశారు. ప్రభుత్వ వైద్యవిద్య సంచాలకుడిగా విధులు నిర్వహించారు. పదవీ విరమణ పొందాక ఎస్ఆర్కే విశ్వవిద్యాలయం యాజమాన్యం అభ్యర్థన మేరకు ఏడేళ్ల క్రితం ఉప కులపతిగా పదవి చేపట్టారు. 70 ఏళ్ల వయస్సులోనూ చురుకుగా ఉన్న డాక్టర్ ఎస్.ఎస్.కుష్వా అక్రమాల మకిలిని అంటించుకున్నారు. భోపాల్లో దంత శస్త్రచికిత్స నిపుణుడిగా పేరొందిన ప్రశాంత్ పిళ్లై తొలుత ఆర్కేడీఎఫ్ దంతవైద్య కళాశాల డీన్గా పనిచేశారు. గతేడాది ఎస్ఆర్కే వర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టారు. నకిలీ పట్టాల వ్యవహారంపై ప్రశాంత్ పిళ్లైకు వాటా ఉందని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ