logo

భార్యా హంతకుడికి జీవిత ఖైదు

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్తకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం

Published : 19 May 2022 02:11 IST

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్తకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ఘాసిరాంతాండాకు చెందిన ఆటో డ్రైవర్‌ రమావత్‌ శ్రీను వివాహం 1996లో రంగారెడ్డిజిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లికి చెందిన లలితతో జరిగింది. 1999లో శ్రీను, లలిత దంపతులు ఉపాధి కోసం తక్కళ్లపల్లికి వచ్చి ఇంటిని నిర్మించుకున్నారు. శ్రీను తాగుడుకు బానిసై భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ నిత్యం గొడవ పడేవాడు. ఈ క్రమంలో 2021 మార్చి 29న ఇద్దరూ ఘర్షణ పడ్డారు. కోపంతో రగిలిపోయిన శ్రీను అదే రోజు అర్ధరాత్రి నిద్రిస్తున్న లలితపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు.   కేసు విచారించిన సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి ఆర్‌.తిరుపతి బుధవారం తీర్పు వెలువరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని