Telangana News: గ్రామీణ ప్రాంతాలకు నేరుగా నిధులిస్తే తప్పేంటి?: రఘునందన్రావు
పంచాయతీల్లో జరిగే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తుందని, అవినీతి లేకుండా ఉండేందుకే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం డబ్బులను నేరుగా ఖాతాల్లో వేస్తుందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు.
హైదరాబాద్: పంచాయతీల్లో జరిగే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తుందని, అవినీతి లేకుండా ఉండేందుకే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం డబ్బులను నేరుగా ఖాతాల్లో వేస్తుందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఎలా ఇస్తుందని సీఎం కేసీఆర్ ప్రశ్నించడం ఏంటని ఆక్షేపించారు. అన్ని పథకాలకు కేంద్రం నిధులిస్తే.. తెరాస చేసినట్లు ప్రచారం చేసుకుంటోందన్నారు. తెలంగాణను చూసి పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ అంటున్నారని.. మరి భారతదేశం లేకపోతే తెలంగాణ ఎక్కడుంటుందన్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా మాట్లాడొద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్లకు రాజ్యసభ సీట్లు కేటాయించారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు ఉద్యమకారులు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. అగ్రకులాల వారికే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని రఘునందన్రావు ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య