logo

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

చెరువులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని జరిగింది.

Published : 20 May 2022 01:58 IST

జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: చెరువులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జవహర్‌నగర్‌ ఫర్హానగర్‌కు చెందిన అబ్దుల్‌ రహీం దంపతులకు ముగ్గురు సంతానం. ఆటో నడుపుకొంటూ జీవనం గడుపుతున్నారు. కాగా ఈదులకుంటలో దుస్తులు ఉతికేందుకు తన ముగ్గురి పిల్లలతో పాటు చెల్లెలి కుమారుడిని తీసుకొని ఆటోలో బయలుదేరాడు. వారితో పాటు తీసుకొచ్చిన మేక దగ్గర చిన్నకొడుకును ఉంచి మిగిలిన ముగ్గురిని తీసుకొని చెరువులోకి దిగాడు. దుస్తులు ఉతుకుతుండగానే ఒడ్డున ఉన్న మేకను చూసి వస్తానని రహీం చిన్నారులకు జాగ్రత్త చెప్పి బయటకొచ్చాడు. కాళ్లకు మట్టి అంటిందని అబ్దుల్‌ అయాన్‌(09), అబ్దుల్‌ అల్తాఫ్‌(07) కాస్త లోతుకు దిగారు. నీళ్లలో మునిగిపోతున్న విషయాన్ని గమనించిన మరో బాలుడు వాళ్లను కాపాడేందుకు దిగాడు. గమనించిన స్థానికుడు ఒకరిని కాపాడి, పోలీసులు సహకారంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని