logo

విద్యావేత్త బాలకృష్ణ కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త ఎ.బాలకృష్ణ (86) నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Published : 20 May 2022 01:58 IST

 

నారాయణగూడ: ప్రముఖ విద్యావేత్త ఎ.బాలకృష్ణ (86) నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల (జీసీపీఇ)లో 1988 నుంచి 1992 వరకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలోని గోపన్నపాలెం ప్రభుత్వ కళాశాలలో కొంతకాలం ప్రిన్సిపల్‌గా పని చేశారు. ఈయన వద్ద శిక్షణ పొందిన వేలాది మంది వ్యాయామ ఉపాధ్యాయులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. అంబర్‌పేట్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని