సొంత చెల్లెలిపై అన్న అత్యాచారం
వావీవరుసలు మరిచిన ఓ కళాశాల విద్యార్థి సొంత చెల్లెలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆ బాలికను ఐదు నెలల గర్భవతిని చేశాడు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం..
బాలిక గర్భం దాల్చడంతో వెలుగు చూసిన ఘటన
నిజాంపేట, న్యూస్టుడే: వావీవరుసలు మరిచిన ఓ కళాశాల విద్యార్థి సొంత చెల్లెలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆ బాలికను ఐదు నెలల గర్భవతిని చేశాడు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. కేరళ నుంచి నగరానికి వలసొచ్చిన ఓ కుటుంబం బాచుపల్లి పరిధిలోని ఓ కాలనీలో నివాసం ఉంటోంది. కుటుంబ యజమాని వ్యాపారం నిర్వహిస్తుండగా భార్య ఐటీ ఉద్యోగి. వీరి కుమారుడు(17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె(13) తొమ్మిదో తరగతి చదువుతోంది. వీరిద్దరు ఇంట్లో ఒకే గదిలో నిద్రించేవారు. ఈ నేపథ్యంలో చెల్లెలిని లోబరుచుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. తరువాత బాలికకు కడుపునొప్పి రావడంతో మాదాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. దాంతో బాలిక గర్భవతని తేలింది. బాలికకు అబార్షన్ చేయించడానికి ఈస్ట్మారేడ్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు విషయాన్ని మేడ్చల్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం(డీసీపీయూ)కు సమాచారం ఇచ్చారు. ఆ విభాగం అధికారుల ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు నిందితుడిపై ఐపీసీ376(2) సెక్షన్తో పాటు పోక్సో చట్టం కింద ఈ నెల 17న కేసు నమోదు చేశారు. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించినట్లు సీఐ కె.నర్సింహారెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.