logo

తమ్ముడిపై గంజి పోశాడని ప్రశ్నించినందుకు దాడి

ఓ హోటల్‌ యజమాని చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజేంద్రనగర్‌ సీఐ కనకయ్య తెలిపిన వివరాల మేరకు...

Published : 20 May 2022 02:49 IST

ముగ్గురు కలిసి బాలుడిని చితక బాదిన వైనం

చికిత్స పొందుతూ మృతి

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ఓ హోటల్‌ యజమాని చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజేంద్రనగర్‌ సీఐ కనకయ్య తెలిపిన వివరాల మేరకు... కర్ణాటకకు చెందిన హుస్సేన్‌బీ భర్త చనిపోవడంతో ఆరు సంవత్సరాల క్రితం బతుకుదెరువు నిమిత్తం రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని సన్‌సిటీకి వచ్చింది. అక్కడ ఖాళీస్థలంలో గుడిసె వేసుకొని జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు మహ్మద్‌హసన్‌(13) స్థానికంగా ఓ హోటల్లో పనిచేసేవాడు. ఈ నెల 11న హసన్‌ పని సక్రమంగా చేయడం లేదని యజమాని అతని ఒంటిపై వేడి గంజిపోశాడు. హసన్‌ విషయాన్ని తల్లికి తెలపడంతో ఆమె పెద్ద కుమారుడు మహ్మద్‌హుస్సేన్‌(16)తో కలిసి వెళ్లి యజమాని ఇమ్రాన్‌(28)ను నిలదీసింది. దీంతో ఇమ్రాన్‌ అతడి సోదరులైన అర్షద్‌(24), రిజ్వాన్‌(26)లను తీసుకొని వెళ్లి అదేరోజు సాయంత్రం హుస్సేన్‌ను విచక్షణా రహితంగా కొట్టారు. దాడిలో హుస్సేన్‌ తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ హుస్సేన్‌ గురువారం సాయంత్రం మృతిచెందినట్లు సీఐ కనకయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని