రైతు వేదికలు... ఇక వీఏఓ కార్యాలయాలు..!
గ్రామాల్లోని రైతు వేదికలు ఇక ప్రభుత్వ కార్యాలయాలుగా మారనున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన వేదికలు కొన్ని చోట్ల అలంకారప్రాయంగా మిగిలాయి. ప్రజాధనం వృథా కాకుండా ఉండేందుకు వ్యవసాయ సహాయ విస్తరణాధికారి
న్యూస్టుడే, పరిగి: గ్రామాల్లోని రైతు వేదికలు ఇక ప్రభుత్వ కార్యాలయాలుగా మారనున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన వేదికలు కొన్ని చోట్ల అలంకారప్రాయంగా మిగిలాయి. ప్రజాధనం వృథా కాకుండా ఉండేందుకు వ్యవసాయ సహాయ విస్తరణాధికారి (ఏఈఓ) కార్యాలయాలుగా మార్చేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. తద్వారా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో వెంటవెంటనే రైతులకు చేరతాయని, ఇటు వీరికి రైతులకు, అటు సిబ్బందికి ప్రయోజనం కలుగుతుందని భావిస్తోంది. ఈనెల 18న హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వానా కాలం సాగు సన్నాహక సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ఇదే విషయాన్ని తెలిపారు. ఇక మీదట వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను రైతు వేదికల్లోనే నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. జిల్లా అధికారులు సైతం కార్యాచరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం.
రూ.21.78 కోట్లతో..
జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో 19 మండలాల్లో వ్యవసాయ శాఖ 99 క్లస్టర్లను ఏర్పాటు చేసింది. 101 మంది ఏఈఓలకు ప్రస్తుతం 85మంది విస్తరణాధికారులు పనిచేస్తున్నారు. అన్ని క్లస్టర్లలో రైతుల వేదికల నిర్మాణాన్ని గతేడాది పూర్తి చేశారు. ఇందుకోసం శాఖా పరమైన నిధులు రూ.12లక్షలు, ఉపాధిహామీ నిధులు రూ.10లక్షల చొప్పున ఒక్కోదానికి రూ.22లక్షలు వెచ్చించారు. మొత్తంగా ఆయా ప్రాంతాల్లో చేసిన ఖర్చు అక్షరాలా రూ.21.78కోట్లు. గతేడాది వానాకాలం నాటికి వ్యవసాయ శాఖ తమ ఆధీనంలోకి తీసుకున్నా చాలా ప్రాంతాల్లో ఊరికి దూరంగా నిర్మాణం చేశారు. దీంతో సమావేశాల నిర్వహణకు అక్కడకు చేరుకునేందుకు అన్నదాతలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనిని గుర్తించిన ప్రభుత్వం కార్యాలయాలుగా మార్చితే లక్ష్యం నేరవేరుతుందని యోచిస్తోంది.
నిత్యం అందుబాటులో..
ప్రతిరోజూ ఏఈఓలు ఉదయం 9గంటలకు రైతు వేదిక వద్దకు వచ్చి పది గంటల తరువాత పంట పొలాలకు వెళ్లాలి. తిరిగి 3గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 5గంటల వరకు వేదికల్లో అందుబాటులో ఉంటారు. సాగు సమస్యలపై ఎప్పటికప్పుడు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి సందేహాలను నివృత్తి చేయాలి. క్లస్టర్ పరిధిలో 5నుంచి 8 గ్రామాల వరకు 5వేల నుంచి దాదాపు 7,500 ఎకరాల వరకు విస్తీర్ణం ఉంది. దీంతో ఒక్కోసారి ఏ గ్రామంలో ఉంటున్నారో రైతులకు తెలియకుండా పోతోంది. ఇకమీదట రైతు వేదికలు కార్యాలయాలుగా మారితే నిత్యం వారు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ప్రతినెలా నిర్వహణ నిధులు
కార్యాలయాల నిర్వహణకు ప్రతినెలా నిధులు రూ.9వేల చొప్పున అందజేస్తారు. రైతు వేదికలకు గతంలోనే ప్రభుత్వం ఫర్నీచర్ను అందజేసింది. ఈక్రమంలో ఒక్కోదానికి పది కుర్చీలు, అల్మారా, మైకు తదితర మౌలిక సదుపాయాలను సమకూర్చింది. వేదికల వద్ద శౌచాలయాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే నీటి సదుపాయం కల్పించాల్సి ఉంది.
క్షేత్ర స్థాయి కష్టాలు తెలుస్తాయి
- మేడిద రాజేందర్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు
క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అధికారుల దృష్టికి వెళ్తాయి. స్థానికంగా ఉంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు తెలుస్తాయి. పంటల సీజన్ సమయంలో విత్తనాలు, ఎరువుల కొరత అన్నది రాకుండా చూసేందుకు ఆస్కారముంది.
తాజా సమాచారం అందుతుంది
- గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
నిత్యం ఏఈఓలు అందుబాటులో ఉంటే చాలా వరకు సమస్యలను నివృత్తి చేసుకుని మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. సాగులో సూచనలు, సలహాలను, సాంకేతిక పద్ధతుల వినియోగం, యాజమాన్య పద్ధతులు అందిస్తారు. దీంతో పాటు ఎప్పటికప్పుడు నివేదికల ద్వారా తాజా సమాచారం కూడా అందనుంది. శాఖా పరంగా అమలు చేస్తున్న రాయితీలు, ఇతరత్రా సమాచారం కూడా రైతుల చెంతకు సకాలంలో చేరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
[ 24-04-2024]
తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం