పేరుకే ఈ-నామ్.. పత్తాలేని ఆచరణ
జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం (ఈ-నామ్) అమలైతే రైతులకు మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇదే ఉద్దేశంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆచరణలో మాత్రం అడుగు ముందుకు
అమల్లోకి వచ్చి ఆరేళ్లు
రైతులకు ఒనగూరని ప్రయోజనం
న్యూస్టుడే, తాండూరు
తాండూరు వ్యవసాయ విపణి
జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం (ఈ-నామ్) అమలైతే రైతులకు మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇదే ఉద్దేశంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. దేశ వ్యాప్త విపణులతో స్థానిక విపణులు ఇంకా అను సంధానం కాలేదు. దీంతో రైతులు తెచ్చిన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల ట్రేడర్లు కొనుగోలు చేయడానికి అవకాశం లేకుండా పోతోంది. ఫలితంగా స్థానిక వ్యాపారులు కొనుగోలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ధరలు లభించడం లేదు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఈ-నామ్ పద్ధతిలో కొనుగోలుకు పోటీ పడితే రైతులకు ఎక్కువ ధర లభించి ఆర్థికంగా అధిక లాభం వీలు కలుగుతుంది. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
2016లో ప్రారంభం: జిల్లాలో 2016 ఏప్రిల్ 14 నుంచి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ-నామ్ను అమల్లోకి తెచ్చింది. మొదటగా రోజువారీ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగే స్పెషల్ గ్రేడ్ (ప్రత్యేక శ్రేణి) తాండూరులో దీన్ని ప్రారంభించింది. తర్వాత గ్రేడ్-1 పరిధిలో ఉన్న వికారాబాద్, గ్రేడ్-2 పరిధిలో ఉన్న పరిగి విపణుల్లో అమల్లోకి వచ్చింది. కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్లకు ఈ-నామ్ను ఎలా వినియోగించాలనే విషయంలో ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పించారు. విపణుల సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. విగణితల్లో ఉత్పత్తుల క్రయ, విక్రయాలను నమోదు చేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఇందు కోసం విపణులలోనే కేబిన్లను ఏర్పాటు చేసి కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇందుకోసం తాండూరులో రూ.40 లక్షలను కేంద్రమే మంజూరు చేసింది. వికారాబాద్, పరిగిలోను అవసరం మేరకు నిధులను మంజూరు చేసింది.
కనిపించని ఉత్పత్తుల చిత్రాలు, వీడియోలు
రైతులు విక్రయానికి తెచ్చిన ఉత్పత్తులను సిబ్బంది చిత్రాలు, వీడియోలు తీసి విగణితల్లోనే అంతర్జాలానికి అప్లోడ్ చేయాలి. వ్యాపారులు ఉత్పత్తులకు సంబంధించిన చిత్రాలను విగణితల్లో చూసి బిడ్డింగులో పోటీ పడతారు. తద్వారా ఆశించిన దానికంటే రైతులకు ధర ఎక్కువగా లభించేందుకు అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలోని విపణులు జాతీయ వ్యవసాయ విపణులకు అనుసంధానమే కాలేదు కాబట్టి ఆప్రక్రియను నిర్వహించడం లేదు.
జాడలేని గ్రేడింగ్ ప్రక్రియ
ఈ- నామ్ అమల్లో ఉంటే విపణి సిబ్బంది రైతులు తెచ్చిన ఉత్పత్తులను ప్రత్యేకంగా గ్రేడింగ్ చేసి విక్రయానికి ఉంచుతారు. దీంతో నాణ్యంగా ఉన్న ఉత్పత్తులు, నాసిరకంగా ఉన్న ఉత్పత్తులు తెలిసి పోతాయి కాబట్టి ఆమేరకు ధరలు పలుకుతాయి. ప్రస్తుతం విపణిల్లో గ్రేడింగ్ పద్ధతి లేకపోవడంతో వ్యాపారులే నాణ్యతా ప్రమాణాలను నిర్ణయించి ఇష్టమొచ్చిన ధరలను నిర్ణయించి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.
జిల్లా, రాష్ట్రంలో కూడా సరిగ్గా లేదు
కనీసం జిల్లా, రాష్ట్రంలోని ఇతర విపణిలకు కూడా అనుసంధాన ప్రక్రియ సరిగ్గా జరగలేదు. కేవలం స్థానిక ట్రేడర్లు మాత్రమే ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి బిడ్డింగులో పాల్గొంటున్నారు. అందరూ పరిచయస్తులే కావడంతో ఏ ట్రేడర్ ఎంత మేరకు ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయాలనే విషయాన్ని ముందే చర్చించుకుని బిడ్డింగ్కు వెళుతున్నారు. ఈ-నామ్ అమల్లో ఉంటే నేరుగా ఇతర రాష్ట్రాల వ్యాపారులే ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు కాబట్టి ఎక్కువ ధర లభిస్తుంది. దేశ వ్యాప్తంగా వివిధ రకాల ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉన్నపుడు మాత్రం స్థానిక ట్రేడర్లు మద్దతుకు మించిన ధరతో కొనుగోలు చేసి రైతులను సంతృప్తి పరుస్తున్నారు.
వానాకాల పంటల విక్రయాలకు ట్రయల్ రన్ నిర్వహిస్తాం
- రాజేశ్వరి, వ్యవసాయ విపణి కార్యదర్శి, తాండూరు
తాండూరు విపణిలో వచ్చే వానాకాలం సీజన్ పంటల కొనుగోళ్లకు ఈ-నామ్ను దేశ వ్యాప్త విపణులతో అనుసంధానిస్తాం. ఈ మేరకు ట్రయల్ రన్ నిర్వహించాలనే ప్రణాళికతో ఉన్నాం. ఇది విజయవంతమైతే రైతుల ఉత్పత్తుల విక్రయాలకు అదే విధానాన్ని అమలు చేస్తాం. ఈ ప్రతిపాదనను త్వరలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చాలా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఉన్నతాధికారులదే తుది నిర్ణయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?