logo

హాల్‌ టికెట్‌ చూపిస్తే.. ఉచిత ప్రయాణం

పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవులు కావడంతో ప్రత్యేకంగా విద్యార్థుల కోసం నడిపే బస్సులు రద్దయ్యాయి. పరీక్షల నేపథ్యంలో

Updated : 23 May 2022 06:19 IST

పరిగి, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవులు కావడంతో ప్రత్యేకంగా విద్యార్థుల కోసం నడిపే బస్సులు రద్దయ్యాయి. పరీక్షల నేపథ్యంలో సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నారు. గ్రామాలకు కూడా వాటిని తిప్పేందుకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపిస్తే చాలు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ పవిత్ర తెలిపారు. విద్యార్థులు పరీక్షల వేళ మానసికంగా సిద్ధంగా కావాలని మండల విద్యాధికారి హరిశ్చందర్‌ అన్నారు. పరీక్షల నేపథ్యంలో ఆయన స్థానికంగా మాట్లాడుతూ ఎలాంటి భయాందోళనకు గురికావద్దన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని