ఆర్డరిస్తే ఆన్‘లైన్’ కడతాయ్!
మొదట కొత్తదనం.. తర్వాత వ్యాపకం.. ఇప్పుడేమో పొదుపు.. నగరంలో ఆన్లైన్ ఆర్డర్లు ఇస్తున్న కొనుగోలుదారుల్లో వచ్చిన మార్పు ఇది. కొవిడ్ భయాలు తగ్గి బయట మార్కెట్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఖర్చు దృష్ట్యా ఇంటి నుంచి కాలు
తెరపై తాకితే తలుపు తడుతున్న వస్తువులు
ఖర్చులు కలిసొస్తున్నాయంటున్న నగరవాసులు
ఈనాడు, హైదరాబాద్
మొదట కొత్తదనం.. తర్వాత వ్యాపకం.. ఇప్పుడేమో పొదుపు.. నగరంలో ఆన్లైన్ ఆర్డర్లు ఇస్తున్న కొనుగోలుదారుల్లో వచ్చిన మార్పు ఇది. కొవిడ్ భయాలు తగ్గి బయట మార్కెట్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఖర్చు దృష్ట్యా ఇంటి నుంచి కాలు కదపకుండానే సకలం గడప వద్ద వాలిపోయే సేవల వైపు నగరవాసులు మొగ్గుచూపుతున్నారు. పాలు, ఫలహారం మొదలు.. కూరగాయలు, పండ్లు, కిరాణా సరకులు, మందులు, మాంసాహారం, విందు భోజనం వరకు మొబైల్పై తాకితే చాలు ఇంటి తలుపు తడుతున్నాయ్.
కొవిడ్ తీవ్రంగా భయపెట్టిన గత రెండేళ్లలో ఇ-కామర్స్ లావాదేవీలు నగరంలో అమాంతం పెరిగాయి. సమయం కలిసి వస్తుండటం, ఒక వస్తువు కోసం పలు మార్కెట్లు తిరిగే పనిలేకుండా.. చరవాణిలోనే వెతికి ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉండటం వంటి సానుకూలతలను కొనుగోలుదారులు గమనించారు. దాన్నే ఇప్పుడూ కొనసాగిస్తున్నారు.
ఆదివారం వచ్చిందంటే..
నగరంలో మాంసాహారం వినియోగం ఎక్కువ. ఆదివారం వచ్చిందంటే మాంసం దుకాణాల ముంగిట క్యూలు ఉండేవి. ఇప్పుడు గతంలోలా క్యూలు ఉండడంలేదు. కాలు బయటపెట్టకుండానే లూసియస్, టెండర్కట్, ఫిపోలా.. ఇలాంటి ఆన్లైన్ సాధనాల ద్వారా ఇంటికే మాంసాన్ని తెప్పించుకుంటున్నారు.
నిత్యావసరాలకు...
నెలవారీ నిత్యావసరాలకు ఆన్లైన్లోనూ పెద్ద సంఖ్యలో ఆర్డర్ ఇస్తున్నారు. నగరంలో వంద వరకు చిన్న, పెద్ద సూపర్మార్కెట్లు ఇంటికే సరకులను చేరవేస్తున్నాయి. బిల్లింగ్ కోసం అరగంటపాటు ఎదురుచూడాల్సి వస్తుండటంతో కొనుగోలుదారులు ఆన్లైన్కు మొగ్గుచూపుతున్నారు. బిగ్ బాస్కెట్, డూన్జో, రిలయన్స్ మార్ట్తో పాటు మరిన్ని యాప్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సరేసరి. పిల్లలకు, పెద్దలకు దుస్తుల కోసం స్నాప్డీల్తో పాటు మరెన్నో యాప్లు హల్చల్ చేస్తున్నాయి. కొన్ని సంస్థలు క్విక్ సర్వీస్ను ప్రారంభించాయి.
వినోదం
ప్రస్తుతం సినిమాలు చూసేందుకు కుటుంబ సమేతంగా ఓటీటీలకు అతుక్కుపోతున్నారు. పెరిగిన టిక్కెట్ల, ఇంధన ధరల నేపథ్యంలో ఇళ్లలోనే తక్కువ ఖర్చుతో చూసేస్తున్నారు. కుటుంబంతో షికారుకు బయటకు వెళ్లాల్సి వస్తే పార్కుల వైపు మొగ్గుచూపుతున్నారు.
పెట్టుబడులు
కొవిడ్ సమయంలో స్థిరాస్తితోపాటు కొత్తతరం ఎక్కువగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ఇదివరకైతే స్టాక్ బ్రోకింగ్ కార్యాలయాల వరకు వెళ్లి డీమ్యాట్ ఖాతా తెరిచి అక్కడి సిబ్బంది ద్వారా షేర్ల లావాదేవీలు నిర్వహించేవారు. గ్రో వంటి యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఇంట్లో చరవాణిలోనే క్రయవిక్రయాలు చేసేస్తున్నారు.
రుచుల వేట..
ఆన్లైన్ ఆర్డర్లలో ఫుడ్ డెలివరీ వాటానే అధికం. ఉదయం ఫలహారం మొదలు బిర్యానీ, కబాబ్ల వరకు ఆర్డర్ల పరంపర అర్ధరాత్రి దాటాక కొనసాగుతోంది. ఇఫ్తార్ సమయంలో స్విగ్గీ ఆర్డర్లను విశ్లేషించగా.. ఏప్రిల్ 2 నుంచి 22వ తేదీ మధ్యలో సాయంత్రం 5-7 గంటల మధ్యనే 4.50 లక్షల ఆర్డర్లు వచ్చాయి. ఆన్లైన్ కోసమే ప్రత్యేకంగా క్లౌడ్ కిచెన్లు ఏర్పాటయ్యాయి.
పోటీ పరీక్షలకు
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను ఇస్తోంది. సాధారణంగా కోచింగ్ సెంటర్లు ఉండే అశోక్నగర్, దిల్సుఖ్నగర్, అమీర్పేట వంటి కేంద్రాలు కిటకిటలాడుతుండేవి. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నా.. అంతకంటే ఎక్కువ మంది ఇంటి నుంచే ఆన్లైన్లోనే శిక్షణ పొందుతున్నారు. ప్రముఖ కోచింగ్ సెంటర్లన్నీ ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. టీవీలో టీశాట్ పాఠాలు బోధిస్తోంది. పుస్తకాలను సైతం అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఇ-కామర్స్తో అత్యధిక మంది ఉపాధి పొందుతుండటం విశేషం.
ఆన్లైన్ ఆర్డర్లపై సర్వేల ఫలితాలు
సౌకర్యం, ఎంపికకు అవకాశం 39%
24% ఫోన్లో ఆర్డర్తో స్థానిక రిటైల్ షాపుల నుంచి తెప్పించుకుంటున్నాం
25% ఆదా చేసే సొమ్ముతో ఎక్కువ వస్తువులు కొనొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
[ 28-03-2024]
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
[ 28-03-2024]
బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో అమ్మవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. -
నగదుంటేనే రైడ్ రైట్
[ 28-03-2024]
ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాబ్ బుక్ అవడం ఓ ప్రహసనమే. అనేక ప్రయత్నాల తర్వాత గానీ బుక్ అవదు. ఒకవేళ అయ్యి పేమెంట్ విధానం ఎంపిక చేసినా.. డబ్బులు ఎలా చెల్లిస్తారంటూ క్యాబ్ డ్రైవర్లు ఫోన్ చేస్తారు. -
సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 28-03-2024]
సీఆర్పీఎఫ్ రికార్డు అసిస్టెంట్ (కానిస్టేబుల్)తో పాటు ఆమె భర్తపై జరిగిన దాడికేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారంటూ పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్ అధికారులపై నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి కొరడా ఝళిపించారు. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 28-03-2024]
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
అదిరే ఆరంభం.. మురిసె అభిమానం
[ 28-03-2024]
ధనాధన్ ఆటకు పేరొందింది ఐపీఎల్ టోర్నీ. అందుకు తగినట్టుగానే నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్, మంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆద్యంతం క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. -
అన్నీ కలిపి.. ఒక్కటే!
[ 28-03-2024]
రానున్న 30ఏళ్ల కోసం పక్కా మాస్టర్ప్లాన్ తయారీకి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు 2050 మాస్టర్ప్లాన్కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో శాంతిభద్రతల విఘాతానికి దారితీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
‘లోక్సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధిస్తాం’
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో రెండంకెల సీట్లను సాధించిన సత్తా చాటుతామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, భారాస పార్టీలు రెండూ ఒక్కటేనని.. -
జకాత్ జరూర్
[ 28-03-2024]
రంజాన్ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ప్రేమను పంచాలని, ఆర్థిక, అసమానతలు తొలగించి, పొరుగువారికి సాయపడాలని ఇస్లాం మూలసిద్ధాంతాలు చెబుతున్నాయి. -
‘డిజిటల్ బ్యాంకింగ్’తో ఆర్థిక లావాదేవీలు సులభం
[ 28-03-2024]
డిజిటల్ బ్యాంకింగ్ విధానంతో ఆర్థిక లావాదేవీలతోపాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరింత సులభతరమవుతుందని వక్తలు పేర్కొన్నారు. -
‘సేవ్ లద్దాఖ్’కు సంఘీభావం
[ 28-03-2024]
సేవ్ లద్దాఖ్ పేరిట అక్కడి ప్రజలు చేపట్టిన పోరాటానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. -
గుడిమల్కాపూర్లో రవీనా టాండన్ సందడి
[ 28-03-2024]
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గుడిమల్కాపూర్లో సందడి చేశారు. -
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
[ 28-03-2024]
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్నారాయణ సూచించారు. -
గుండెకు అరుదైన శస్త్ర చికిత్స
[ 28-03-2024]
దేశంలోనే మొదటిసారిగా తమ ఆసుపత్రిలో మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఎంఎంఎస్ ముఖర్జీ తెలిపారు. -
నైపుణ్యం ఉంటే.. కొలువు వెంటే
[ 28-03-2024]
ఇంజినీర్లు, పట్టభద్రులు ఉద్యోగావకాశాల కోసం వెదుకుతుంటే.. మరో వైపు ప్రతిభావంతులైన నిపుణుల కోసం కార్పొరేట్, స్టార్టప్లు వెదుకుతున్నాయని పలువురు వక్తలన్నారు. -
అనుమతి లేని ఆసుపత్రుల మూసివేత
[ 28-03-2024]
మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం చిలుకానగర్లో ఆకస్మిక తనిఖీలు చేసి అనుమతి లేని వైద్యశాలలను సీజ్ చేశారు. -
హరిత లక్ష్యం.. కార్యాచరణకు సమాయత్తం
[ 28-03-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు, పల్లెల్లో పచ్చందాల వృద్ధికి ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ‘హరిత హారం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. -
రూ.లక్షలు వెచ్చించి.. మూలకు చేర్చి!
[ 28-03-2024]
మున్సిపాలిటీల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు అధికారులు రూ.లక్షలు పోసి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని రకరకాల కారణాలు చెబుతూ మూలకు చేరుస్తున్నారు. -
కలెక్టరేట్లో 24 గంటల సహాయ కేంద్రం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
టీఎస్ ఈఏపీసెట్ సెంటర్లు పెంచే యోచన: జేఎన్టీయూ
[ 28-03-2024]
టీఎస్ ఈఏపీసెట్-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్కు 1,93,468 దరఖాస్తులు రాగా.. -
సెల్ఫోన్ చోరీల ముఠా అరెస్టు
[ 28-03-2024]
ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్లు అపహరించుకుపోతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
సాంకేతిక లోపంతో ఆగిన మెట్రో
[ 28-03-2024]
సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్లో బుధవారం ఉదయం 15 నిమిషాలపాటు మెట్రోరైలు ఆగింది. -
ఎన్నికల ఫిర్యాదులకు 24 గంటల టోల్ఫ్రీ నంబర్
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నంబరు 1800 425 2050కు సమాచారం ఇవ్వొచ్చని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ముందుకు సాగని నకిలీ సీఐడీ అధికారుల కేసు
[ 28-03-2024]
నకిలీ సీఐడీ అధికారులమంటూ ఓ ఐటీ సంస్థ కార్యాలయంపై దాడి చేసిన ముఠాకు సహకారం అందించిన కీలక నిందితుడు, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎస్ఐ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్