logo

నా భార్యను పంపకుండా వేధించారు

తన మరణానికి బావమరిది, మామ కారణమని.. వారిని శిక్షించాలని లేఖ రాసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై

Published : 23 May 2022 02:32 IST

మామ, బావమరిదిని శిక్షించాలని లేఖ రాసి యువకుడి బలవన్మరణం

వినోద్‌కుమార్‌

ఆదిభట్ల, న్యూస్‌టుడే: తన మరణానికి బావమరిది, మామ కారణమని.. వారిని శిక్షించాలని లేఖ రాసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సురేష్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల మున్సిపల్‌ పరిధిలోని కొంగరకలాన్‌కు చెందిన మంకాల అశోక్‌, సుగుణమ్మ దంపతుల చిన్న కుమారుడు వినోద్‌కుమార్‌(29) కొంగర కలాన్‌లో క్షౌరశాల నిర్వహిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం బడంగ్‌పేటకు చెందిన సౌమ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. సౌమ్య తండ్రి రవీందర్‌ అవసరం నిమిత్తం డబ్బు కావాలని కోరడంతో వినోద్‌కుమార్‌ ఏడాది క్రితం రూ.4.73 లక్షలు అప్పు ఇప్పించాడు. సౌమ్య ఆ డబ్బు తీసుకొస్తానని పుట్టింటికి వెళ్లింది. నెల రోజులు గడిచినా రాలేదు. బావమరిది సాయికృష్ణ, మామ కలిసి తన భార్యను రాకుండా ఆపుతున్నారని తల్లిదండ్రులతో చెప్పి బాధపడ్డాడు. శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కుమారుడి మరణానికి కారణమైన రవీందర్‌, సాయికృష్ణలపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని