logo

Ambulance: అంబులెన్స్‌కు దారిచ్చే క్రమంలో ఏడు కార్లు ఢీ

బీజాపూర్‌ రహదారిపై ఒకేసారి ఏడు కార్లు ఢీకొన్న సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో ముందు వైపు నుంచి అంబులెన్స్‌

Published : 23 May 2022 06:58 IST

ప్రమాదానికి గురైన వాహనాలు

చేవెళ్ల, న్యూస్‌టుడే: బీజాపూర్‌ రహదారిపై ఒకేసారి ఏడు కార్లు ఢీకొన్న సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో ముందు వైపు నుంచి అంబులెన్స్‌ వస్తోంది. దీన్ని గమనించిన ముందు కారు నడుపుతున్న వ్యక్తి వాహన వేగాన్ని ఒక్కసారిగా తగ్గించారు. దీంతో దాని వెనుక వస్తున్న ఏడు కార్లు ఒకదాని వెనుక మరొకటి ఢీకొనడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలువురు వాహనదారులు చొరవ తీసుకుని ప్రమాదానికి గురైన కార్లను రోడ్డు పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. వాహనాల మధ్య కనీస దూరం పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చేవెళ్ల ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని