రూ.కోట్లు వ్యయం... పథకం అలంకారప్రాయం
కాగ్నానదిలో పుష్కలంగా నీరున్నా.. సాగుకు వాడుకోలేని దుస్థితి. రూ.కోట్లు ఖర్చు చేసి బాగు చేసిన ఎత్తిపోతల పథకం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. అధికారుల అలసత్వం... సాగునీటి సంఘం ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారు.
నవాంద్గీ ఎత్తిపోతలకు నిర్వహణ లోపం
అధికారులు, సాగునీటి సంఘం సభ్యుల అలసత్వం
న్యూస్టుడే, బషీరాబాద్
కాగ్నానదిలో పుష్కలంగా నీరున్నా.. సాగుకు వాడుకోలేని దుస్థితి. రూ.కోట్లు ఖర్చు చేసి బాగు చేసిన ఎత్తిపోతల పథకం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. అధికారుల అలసత్వం... సాగునీటి సంఘం ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారు. ఎకరా పొలానికి కూడా నీరు పారించుకోలేకపోతున్నారు. అన్నీ బాగానే ఉన్నా.. నిర్వహణకు వీలుకాక నేలను తడిపే తోవ లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదైనా అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం.
బాగు చేసి మూడేళ్లు...
ఎత్తిపోతల పథకం మోటార్లు, ఇతర సామగ్రి పాడవడంతో మూడేళ్ల క్రితం అప్పటి సాగునీటి శాఖ మంత్రి రూ.1.29 కోట్లు విడుదల చేశారు. కొత్త మోటర్లు, విద్యుత్ పరికరాలు, ఎత్తిపోతల బావికి నీరొచ్చేలా గొట్టపు సొరంగం ఏర్పాటు చేసి అంతా బాగు చేశారు. పొలాలకు నీరు పారించేందుకు ట్రయల్ రన్ సైతం నిర్వహించారు. నీళ్లు పుష్కలంగా బయటికి వచ్చాయి. త్వరలో ప్రారంభిస్తాం.. అంటూ అధికారులు చెప్పి వెళ్లిపోయారే తప్ప మళ్లీ మొహం చూడలేదని రైతులు పేర్కొంటున్నారు. తమకు ప్రారంభించుకోవాలని అధికారులు చెప్పలేదని సాగునీటి సంఘం ప్రతినిధులు వివరిస్తున్నారు. మరికొన్ని రోజులైతే బిగించిన మోటర్లు, సామగ్రి మూలకు చేరే ప్రమాదం ఉందని..ఈసారైనా పునరుద్ధరణ చేయాలని రైతులు కోరుతున్నారు.
చేతినిండా పనే...
పథకం బాగున్నప్పుడు ఆయకట్టు రైతులకు నీరందడంతో ఏడాదిలో రెండు పంటలు సాగు చేసుకునేవారు. ప్రస్తుతం పడావుగా మారడంతో బీడుగా మారి రైతులు కూలీలుగా మారారు. ఈ ఏడాది నీరందిస్తే చేతినిండా పని ఉంటుందని వివరిస్తున్నారు. వరి, వేరుసెనగ పంటలకు ఈ నేలలు అనువైనవి. ప్రతి సీజనులో ఒక్కో రైతు ఎకరాకు వరి 30 బస్తాలు, వేరుసెనగ 35 బస్తాల వరకు పండించేవారు. పొలానికి నీరు చేరి మళ్లీ పాత రోజులు రావాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.
* పథకం పేరు: నవాంద్గీ ఎత్తిపోతల (బషీరాబాద్), 1974లో నిర్మాణం.
* లక్ష్యం: 550 ఎకరాలకు సాగునీరందించడం.
* ఎందుకు ఆగింది: మోటర్లు పాడవడం, ఎత్తిపోతల బావికి ఇసుక మేటలు పేరుకుపోవడం.
* ప్రస్తుత స్థితి: రూ.1.29 కోట్ల వ్యయంతో అంతా బాగు చేశారు.
* ఇప్పుడేం చేయాలి: అధికారులు, సాగునీటి సంఘం ప్రతినిధులు చొరవ చూపాలి.
మరో రూ.8లక్షలు మంజూరు...
ఎత్తిపోతల కాల్వలు బాగు చేయాలనే రైతుల కోరిక మేరకు ఇటీవల సాగునీటి శాఖ రూ.8 లక్షలు మంజూరు చేసింది. కుడి, ఎడమ కాల్వలను బాగు చేస్తే వృథా కాకుండా రైతుల పొలాలకు చక్కగా పారతాయి. గుత్తేదారుకు పనులు సైతం అప్పగించారు. ఈ వేసవిలోనే కాల్వలను బాగు చేయిస్తే వానా కాలం సీజను నాటికి నీరు పారించుకోవచ్చని రైతులు వివరిస్తున్నారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటేనే ఈసారి పథకం ప్రారంభమై బీడు భూములు పచ్చని పొలాలుగా మారతాయి.
ఇస్తే పంటలు పండిస్తాం: నర్సింహులు, ఆయకట్టు రైతు, నవాంద్గీ
ఎత్తిపోతల పథకం కింద నాకు రెండెకరాల పొలం ఉంది. ఈసారి నీరొస్తుందని భావించాను. పథకాన్ని ప్రారంభించకపోవడంతో భూమి పడావుగా మారింది. అంతా బాగైంది. నీటిని అందించడమే ఉందని అధికారులు చెప్పారు. మూడేళ్లు దాటినా ఎవరూ స్పందించడం లేదు. ఈ వానాకాలంలోనైనా నీరందిస్తే వరి సాగు చేసుకుంటాం.
పనులన్నీ పూర్తయ్యాయి: సాయి, నీటి పారుదల శాఖ ఏఈ, బషీరాబాద్
ఎత్తిపోతల పనులు పూర్తయ్యాయి. ఉన్నతాధికారులకు వివరించి ఆయకట్టు రైతులు, సాగునీటి సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రైతులకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటాం. వచ్చే వానాకాలం సీజనులో పంటల సాగయ్యేలా కార్యాచరణ చేపడతాం. ఎత్తిపోతల బావి, కాల్వలను బాగు చేయించేందుకు కూడా యత్నిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్
[ 23-04-2024]
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డికి బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM