Malla Reddy: రేవంత్ నన్ను మామూలుగా బ్లాక్ మెయిల్ చేయలేదు: మంత్రి మల్లారెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనను అడుగడునా బ్లాక్మెయిల్ చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనను అడుగడుగునా బ్లాక్మెయిల్ చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు రేవంత్ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి విరుచుకుపడ్డారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయం కోసం భూములు కొన్న విషయం వాస్తవమే అయినా.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. తెదేపాలో ఉన్ననాటి నుంచి రేవంత్ తనను బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేశారని తీవ్ర విమర్శలు చేశారు.
‘‘రేవంత్రెడ్డి నన్ను మామూలు బ్లాక్ మెయిల్ చేయలేదు. తెదేపాలో ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఎంపీ సీటు రాకుండా చేసేందుకు రేవంత్ చాలా ప్రయత్నించారు. ఒకే పార్టీలో ఉన్నా ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఎంతో బాధ పడ్డా. రేవంత్ కుమార్తె పెళ్లి ఎవరి డబ్బుతో జరిగింది? ఆ పెళ్లికి నా డబ్బే ఇచ్చాను. దీనిపై యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిపై ప్రమాణానికి రేవంత్ సిద్ధమా? నేను ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి కొనలేదు. నా యూనివర్సిటీ కోసం మార్కెట్ రేటు కంటే నాలుగింతలు ఖర్చు చేసి కొన్నా. భూమి కొనడం తప్పా?కాంగ్రెస్, భాజపా వాళ్లు కొనడం లేదా? రేవంత్ ఇప్పటికీ నన్ను విడిచిపెట్టకుండా అదే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’’ అని మల్లారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్