కేబుల్ వేయడం కంటే..అనుమతులకే భారీ వ్యయం
వానాకాలంలో సాధ్యమైనంత వరకు విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. గాలివాన వచ్చినా సాఫీగా కరెంట్ సరఫరా చేసేందుకు శాశ్వత పరిష్కారాలకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
జీహెచ్ఎంసీ లీజింగ్ ఛార్జీలు..కొత్తలైన్లకు ప్రతిబంధకం
వానాకాలం సన్నద్ధతపై ఈనాడు’తో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి
ఈనాడు, హైదరాబాద్: వానాకాలంలో సాధ్యమైనంత వరకు విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. గాలివాన వచ్చినా సాఫీగా కరెంట్ సరఫరా చేసేందుకు శాశ్వత పరిష్కారాలకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. భూగర్భ కేబుళ్లతో అంతరాయాలకు చెక్ పెట్టే అవకాశం ఉన్నా.. జీహెచ్ఎంసీ కొత్తగా లీజింగ్ ఛార్జీలు ప్రవేశపెట్టడం, రహదారి తవ్వకం అనుమతుల రుసుములు పెంచడం ప్రతిబంధకంగా మారిందన్నారు. ‘ఈనాడు’తో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతూ..
వానాకాలంలో అంతరాయాలకు శాశ్వత పరిష్కారం లేదా?
చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొడుగు ఉండే కరెంట్ తీగల(కవర్ కండక్టర్ల)ను గతంలో వేర్వేరు పథకాల కింద వేశాం. కొత్తగా కేంద్రం ప్రకటించిన ఆర్డీఎస్ పథకంలోనూ ప్రతిపాదించాం. భూగర్భ కేబుళ్ల పరిధిని విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. రుసుములే ప్రతిబంధకంగా మారాయి. భూగర్భకేబుల్ వేసేందుకు అయ్యే వ్యయం కంటే రహదారుల తవ్వకానికి జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన ఫీజులే ఎక్కువ అవుతున్నాయి. మీటర్ రోడ్డు తవ్వకానికి గతంలో అనుమతి రుసుం రూ.2200 ఉండేది. ఇటీవల దాన్ని మరో రూ.300 పెంచారు. ఇది కాకుండా భూగర్భంలో కేబుల్ వేస్తున్నందుకు 25 ఏళ్లపాపాటు వర్తించేలా కొత్తగా లీజింగ్ ఛార్జీలు మీటర్కు రూ.300 వసూలు చేస్తున్నారు. దీంతో కేబుల్ వేసేందుకు అయ్యే ఖర్చు కంటే అనుమతుల కోసం ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. దీంతో భూగర్భ కేబుల్స్ వేయడం కొంత తగ్గించాం. ఆర్డీఎస్ గతంలో ఈ ఛార్జీలను మినహాయిస్తే మొత్తం ప్రధాన రహదారుల వెంట భూగర్భ కేబుల్ వేస్తామని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాం.
నగరంలో డిమాండ్కు తగ్గట్లు సేవలందిస్తున్నారా?
డిస్కంకు ఆదాయపరంగా హైదరాబాద్ ప్రాంతం అత్యంత కీలకం. మా కొచ్చే ఆదాయంలో అత్యధికం ఇక్కడి నుంచే. సేవల్లో లోపాలు తలెత్తకుండా నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నాం. హైడల్ విద్యుత్తు ఉత్పత్తి లేకున్నా.. పెరిగిన డిమాండ్కు సరిపడా కరెంట్ సరఫరా చేశాం.
పాతబస్తీలో చౌర్యం కేసులు ఎందుకు తగ్గుతున్నాయి?
పాతబస్తీలో కేసులు తక్కువ ఉండటానికి పరిధి తక్కువ ఉండటమే కారణం. ఇక్కడ సైతం కేసులు నమోదు చేస్తున్నాం. ఆదాయం రావడం లేదు అనేది కూడా సరైంది కాదు. ఈనెల రూ.108 కోట్ల డిమాండ్ వచ్చింది. వంద శాతం వసూలు అవుతోంది.
గాలివానతో ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
విద్యుత్తు తీగల కింద, సమీపంలో చెట్లు ఉన్న చోట గాలులకు, వానకు కొమ్మలు తాకి అంతరాయాలకు దారితీస్తున్నాయి. వీటిని నివారించేందుకు ఇప్పటికే తీగల కింద కొమ్మలు కొట్టడం పూర్తయ్యింది. గాలివానకు చెట్లు తీగలపై పడితే సత్వరం తొలగించేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసి సిబ్బందికి అందుబాటులో ఉంచాం. భారీ వృక్షాలు పడితే జీహెచ్ఎంసీ సాయం తీసుకుంటున్నాం.
కొత్త కనెక్షన్లకు డిమాండ్ పెరగడానికి కారణం?
గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పర్చుకునేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ల నిర్మాణాలు పెరిగాయి. కొవిడ్ తర్వాత వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. వీటి ఫలితంగానే ఏడాది కాలంలోనే 6 లక్షల కొత్త కనెక్షన్లు వచ్చాయి. అందుకు తగ్గట్టే కరెంట్ డిమాండ్ సైతం పెరిగింది. టారిఫ్ ఛార్జీల పెంపుతో ఆ మేరకు ఆదాయమూ పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు