logo

డ్రోన్లపై నిషేధం

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ), గచ్చిబౌలి స్టేడియం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్‌లు, మైక్రో లైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, పారా గ్లైడర్‌లు ఎగురవేయడంపై నిషేధం విధిస్తున్నట్లు నగర(సైబరాబాద్‌ ఇన్‌ఛార్జ్‌) పోలీస్‌

Published : 25 May 2022 04:32 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ), గచ్చిబౌలి స్టేడియం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్‌లు, మైక్రో లైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, పారా గ్లైడర్‌లు ఎగురవేయడంపై నిషేధం విధిస్తున్నట్లు నగర(సైబరాబాద్‌ ఇన్‌ఛార్జ్‌) పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న మధ్యాహ్నం 12 గంటల నుంచి 26న సాయంత్రం 6 గంటల వరకు ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ఎవరైనా ఎగురవేస్తే ఐపీసీ సెక్షన్‌లు 188, 121, 121(ఏ), 287, 336, 337, 338 తదితర సెక్షన్‌ల కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని