logo

రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆ యువకుడు కిందపడి

Published : 26 May 2022 02:32 IST

బాలానగర్‌, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆ యువకుడు కిందపడి తీవ్రగాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాలానగర్‌ సీఐ వహీదుద్దీన్‌ కథనం ప్రకారం.. నాగార్జునకాలనీకి చెందిన సయ్యద్‌ ఆరిఫ్‌ (19) కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ ఏడాది చదువుతున్నాడు. బుధవారం ఉదయం కళాశాలకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. బాలానగర్‌ వంతెనపైకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఆరిఫ్‌ కిందపడగా తలకు తీవ్రగాయాలయ్యాయి. అటుగా వెళుతున్న కొందరు పడిపోయిన వ్యక్తి జేబులో నుంచి సెల్‌ఫోన్‌ తీసుకొని అందులోని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరిఫ్‌ మృతి చెందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని