logo

110 గ్రాముల హాష్‌ ఆయిల్‌ పట్టివేత

జూబ్లీహిల్స్‌లో 110 గ్రాముల హాష్‌ ఆయిల్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయిల్‌ను విక్రయిస్తున్న ఇద్దరితోపాటు నలుగురు వినియోగదారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల

Published : 26 May 2022 02:30 IST

పోలీసుల అదుపులో ఇద్దరు సరఫరాదారులు, నలుగురు వినియోగదారులు

షేక్‌ బిలాల్‌, పవన్‌కుమార్‌

జూబ్లీహిల్స్‌: జూబ్లీహిల్స్‌లో 110 గ్రాముల హాష్‌ ఆయిల్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయిల్‌ను విక్రయిస్తున్న ఇద్దరితోపాటు నలుగురు వినియోగదారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 38లో ఇద్దరు వ్యక్తులు హాష్‌ అయిల్‌ విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న షేక్‌ బిలాల్‌(28), వెంకట పవన్‌కుమార్‌(26)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 90 గ్రామలు హాష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. వారినుంచి కొనుగోలు చేసే అనుపతి భరత్‌రెడ్డి(22), రూపేష్‌ ప్రతాప్‌సింగ్‌(35), అర్నబ్‌సేన్‌(40), సౌరవ్‌సేన్‌(43)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 110 గ్రాముల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకోవడంతోపాటు రెండు చరవాణులు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు. సమావేశంలో డీఐ ఆకుల రమేష్‌, ఎస్సైలు నాయుడు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని