logo

కోర్టు పరిసరాల్లోకి కత్తితో ప్రవేశించిన వ్యక్తి అరెస్టు

సోదరితో కలిసి కోర్టు పరిసరాల్లోకి చిన్నపాటి మడత కత్తితో వచ్చిన ఓ యువకుడిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టుచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురంలోని ప్రశాంత్‌నగర్‌లో

Published : 26 May 2022 02:30 IST

నాగోలు, న్యూస్‌టుడే: సోదరితో కలిసి కోర్టు పరిసరాల్లోకి చిన్నపాటి మడత కత్తితో వచ్చిన ఓ యువకుడిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టుచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురంలోని ప్రశాంత్‌నగర్‌లో నివసించే శ్రీపాద సాయికిరణ్‌(24) గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. అతని సోదరి మియాపూర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అక్బర్‌తో ఏడాదిన్నర కిందట ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుంది. మూణ్నెళ్ల తర్వాత అక్బర్‌ నుంచి విడిపోయింది. విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు అక్బర్‌పై గృహహింస కేసు నమోదయ్యింది. బుధవారం ఆ కేసుకు సంబంధించిన తుది తీర్పు ఉండటంతో ఆమె తన సోదరుడు సాయికిరణ్‌తో కలిసి ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టుకు వచ్చింది. కోర్టు భవనంలోకి ప్రవేశించే సమయంలో అక్కడి పోలీసులు సాయికిరణ్‌ను తనిఖీ చేయగా ప్యాంటు జేబులో దాచిన చిన్నపాటి మడత కత్తి బయటపడటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని