కోర్టు పరిసరాల్లోకి కత్తితో ప్రవేశించిన వ్యక్తి అరెస్టు
సోదరితో కలిసి కోర్టు పరిసరాల్లోకి చిన్నపాటి మడత కత్తితో వచ్చిన ఓ యువకుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టుచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురంలోని ప్రశాంత్నగర్లో
నాగోలు, న్యూస్టుడే: సోదరితో కలిసి కోర్టు పరిసరాల్లోకి చిన్నపాటి మడత కత్తితో వచ్చిన ఓ యువకుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టుచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురంలోని ప్రశాంత్నగర్లో నివసించే శ్రీపాద సాయికిరణ్(24) గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. అతని సోదరి మియాపూర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్బర్తో ఏడాదిన్నర కిందట ఆర్య సమాజ్లో ప్రేమ వివాహం చేసుకుంది. మూణ్నెళ్ల తర్వాత అక్బర్ నుంచి విడిపోయింది. విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు అక్బర్పై గృహహింస కేసు నమోదయ్యింది. బుధవారం ఆ కేసుకు సంబంధించిన తుది తీర్పు ఉండటంతో ఆమె తన సోదరుడు సాయికిరణ్తో కలిసి ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టుకు వచ్చింది. కోర్టు భవనంలోకి ప్రవేశించే సమయంలో అక్కడి పోలీసులు సాయికిరణ్ను తనిఖీ చేయగా ప్యాంటు జేబులో దాచిన చిన్నపాటి మడత కత్తి బయటపడటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె