logo

మృతదేహాలు ఎదురైనా.. ముందుకెళ్లా: అన్వితారెడ్డి

ఎనిమిదేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి బుధవారం నగరానికి చేరుకున్న భువనగిరికి చెందిన అన్వితారెడ్డి తెలిపారు. గడ్డకట్టే చలి, ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడం, దారిలో ఎన్నో మృతదేహాలు

Updated : 26 May 2022 05:55 IST

అన్వితారెడ్డికి కేకు తినిపిస్తున్న తల్లిదండ్రులు మధుసూదన్‌రెడ్డి, చంద్రకళ

పంజాగుట్ట, న్యూస్‌టుడే: ఎనిమిదేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి బుధవారం నగరానికి చేరుకున్న భువనగిరికి చెందిన అన్వితారెడ్డి తెలిపారు. గడ్డకట్టే చలి, ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడం, దారిలో ఎన్నో మృతదేహాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా అడుగు ముందుకు వేయడంతోనే విజయం సాధ్యమైందన్నారు. సోమాజిగూడలోని మెర్క్యూరీ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో అన్వితారెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులు మధుసూదన్‌రెడ్డి, చంద్రకళను అన్వితా గ్రూపు అధినేత అచ్యుతరావు బొప్పన ఆధ్వర్యంలో పలువురు సన్మానించారు.  భువనగిరిలోని రాక్‌ క్లింబింగ్‌ పాఠశాలకు చెందిన కోచ్‌ శేఖర్‌బాబు శిక్షణ, అన్వితా గ్రూపు అధినేత అచ్యుతరావు సహకారం విజయాన్ని సాధించేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని