నగరంలో 132 కేవీ.. శివార్లలో 220 కేవీ
విద్యుత్తు వాడకం అధికమవడం.. ఇప్పటికే ఉన్న ఉప కేంద్రాలపై లోడు పెరుగుతుండటంతో ట్రాన్స్కో నూతన విద్యుత్తు ఉప కేంద్రాల నిర్మాణంపై దృష్టిపెట్టింది. అవుటర్ రింగ్ రోడ్డు చేరువలో విల్లాలు, పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు,
నూతన విద్యుత్తు ఉప కేంద్రాల నిర్మాణం
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్తు వాడకం అధికమవడం.. ఇప్పటికే ఉన్న ఉప కేంద్రాలపై లోడు పెరుగుతుండటంతో ట్రాన్స్కో నూతన విద్యుత్తు ఉప కేంద్రాల నిర్మాణంపై దృష్టిపెట్టింది. అవుటర్ రింగ్ రోడ్డు చేరువలో విల్లాలు, పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు, ఫార్మా సంస్థల కార్యకలాపాలు ఊపందుకోవడంతో అక్కడ విద్యుత్తు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో 132 కేవీ, శివార్లలో (అవుటర్) 220 కేవీ ఉపకేంద్రాలు నిర్మించనున్నారు. బౌరంపేటలో ఇప్పటికే 220 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం పనులు పురోగతిలో ఉండగా, సీతారాంబాగ్లో కొత్తగా 132 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణం చేపట్టబోతుంది. అసిఫ్నగర్ నుంచి సీతారాంబాగ్ వరకు భూగర్భ కేబుళ్లు వేయనున్నారు.
70 శాతానికి చేరితే..
విద్యుత్తు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాలను టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్మించి నిర్వహిస్తోంది. ఇందుకోసం 400, 220, 132 కేవీ ఉప కేంద్రాలు నిర్మిస్తుంది. జెన్కో, ఇతర ఉత్పత్తి కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును స్టెప్డౌన్ చేస్తూ ట్రాన్స్కో సరఫరా చేస్తుంది. ఉప కేంద్రాలపై లోడు 70 శాతానికి చేరితే.. కొత్త వాటి నిర్మాణంపై దృష్టిపెడుతుంది. ప్రస్తుతం అసిఫ్నగర్ ఉప కేంద్రం లోడు 70 శాతానికి చేరిందని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టు సీతారాంబాగ్లో కొత్తగా 132 కేవీ ఉప కేంద్రాన్ని నిర్మించనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ రెండు ఉపకేంద్రాల మధ్య ఆరు లేన్లలో అసిఫ్నగర్ నుంచి మెహిదీపట్నం మీదుగా సీతారాంబాగ్ వరకు దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల దూరం భూగర్భ కేబుళ్లు వేస్తారు. రద్దీగా ఉండే మెహిదీపట్నం రహదారి కింద 1.8 మీటర్ల లోతులో ఆరు కేబుళ్లు వేయనున్నారు. మెహిదీపట్నంలో ఇప్పటికే రహదారి తవ్వి వివరాలను సేకరించారు. పనుల వ్యయం రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఖర్చు తగ్గించేందుకు స్టోర్లోని కేబుల్నే వినియోగించనున్నారు. చివర్లో తగ్గితే అప్పుడు కొనుగోలు చేస్తామని ట్రాన్స్కో ట్రాన్స్మిషన్ డైరెక్టర్ టి.జగత్రెడ్డి తెలిపారు.
మూడు విధాలుగా..
బౌరంపేటలో హైటెన్షన్ టవర్లు, మోనోపోల్స్, భూగర్భ కేబుళ్లు.. ఇలా మూడు విధాలుగా కేబుళ్లు వేస్తున్నారు. నర్సాపూర్ నుంచి గండిమైసమ్మ మీదుగా బౌరంపేట వరకు దాదాపు 35 కి.మీ. దూరం ఉంటుంది. అవుటర్ దాకా హైటెన్షన్ టవర్ల ద్వారా దాదాపు 25 కిలోమీటర్లు ఓవర్ హెడ్ లైన్లు వేస్తున్నారు. అవుటర్ వెంట 5 కి.మీ. పొడవున మోనోపోల్స్ వేస్తున్నారు. తొలిసారి ఈ స్తంభాలను రాయదుర్గం 400 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం లైన్లలో వాడారు. ఇప్పుడు బౌరంపేటలో ఉపయోగిస్తున్నారు. అవుటర్ లోపల నుంచి బౌరంపేట వరకు మరో ఐదు కిలోమీటర్లు భూగర్భ కేబుళ్లు వేయనున్నారు. యూజీ కేబుల్ పనులు ఇప్పటికే 3 కి.మీ. పూర్తయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో