CM KCR: బెంగళూరు చేరుకున్న సీఎం కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగళూరు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి అక్కడి పద్మనాభ నగర్లో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ నివాసానికి కేసీఆర్ వెళ్లారు.
బెంగళూరు: తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగళూరు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి అక్కడి పద్మనాభ నగర్లో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ నివాసానికి కేసీఆర్ వెళ్లారు. దేవెగౌడతో పాటు ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో సీఎం సమావేశమయ్యారు. అనంతరం వారితో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు.
మధ్యాహ్న భోజనం అనంతరం ప్రస్తుత జాతీయ రాజకీయాలు, ఇతర సమకాలీన అంశాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశం, ఇందులో ప్రాంతీయ పార్టీల పాత్రపై వారు చర్చించే అవకాశముంది. కేసీఆర్ పర్యటన సందర్భంగా పద్మనాభనగర్లోని దేవెగౌడ ఇంటి పరిసరాల్లో అభిమానులు కేసీఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు