Telangana News: భాజపా అధికారంలోకి వస్తుందనేది ఆ పార్టీ నేతల పగటికల: హరీశ్రావు
తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందనేది ఆ పార్టీ నేతల పగటికల అని రాష్ట్ర మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు
హైదరాబాద్: తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందనేది ఆ పార్టీ నేతల పగటికల అని రాష్ట్ర మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు. 8 ఏళ్లలో తెలంగాణకు భాజపా ఇచ్చిందేమిటో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చే పార్టీ తెరాస అని ధీమా వ్యక్తం చేశారు. భాజపా చేసేది గోరంత.. చెప్పేది కొండంత అని ఎద్దేవా చేశారు. గ్యాస్ సిలిండర్పై రాయితీ ఎత్తేశారని మండిపడ్డారు. ఇది గుజరాత్ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ అని ప్రధాని గుర్తుంచుకోవాలన్నారు. ఇతర పార్టీల నుంచి వారసులను భాజపాలో ఎందుకు చేర్చుకుంటున్నారు? వారసులను భాజపాలో చేర్చుకుంటే తప్పులేదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ.. ఆయన స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవారు నాడు ఉన్నారు.. నేడు ఉన్నారు.. అని హరీశ్రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఓర్వలేని తనంతో ప్రధాని అలా మాట్లాడుతున్నారు: గంగుల కమలాకర్
‘‘ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మారు. తెలంగాణ రాష్ట్రమన్నా, ఉద్యమ నేత కేసీఆర్ కుటుంబమన్నా భాజపా నేతలకు భయం పట్టుకుంది. కులాలు, మతాలు, వర్గాలను అడ్డుపెట్టుకొని భాజపా రాజకీయం చేస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో విద్వేషాలు రెచ్చగొట్టి నేతలు పబ్బం గడుపుకొన్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కర్ఫ్యూలు, విధ్వంసం ఉండేది. ఇవాళ సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ శాంతి భద్రతలతో అభివృద్ధి దిశగా పయనిస్తోంది. గుజరాత్ రాష్ట్రం కన్నా అన్ని రంగాల్లో తెలంగాణ ముందుందనే ఓర్వలేని తనంతో ప్రధాని మాట్లాడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. దేవుడిని గుండెల్లో పెట్టుకొని పూజించే వాళ్లం మేమైతే.. అదే దేవుడిని అడ్డుపెట్టుకొని భాజపా సెంటిమెంటు రాజకీయాలు చేస్తోంది. మోదీ అసమర్థ పాలనను తరిమికొట్టేందుకు, దేశ ప్రజలకు మంచి చేసేందుకు కేసీఆర్ యావత్ దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు’’ అని గంగుల పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని