పారదు జలం.. పండదు పొలం
అటవీ ప్రాంతంలో గుట్టలపై కురిసిన వర్షం నీరు వృథాగా పోకుండా ఒడిసిపడితే బీడు భూములను పచ్చటి పొలాలుగా మార్చవచ్చు. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలో రూ.7 కోట్లతో మూడు చెరువులను నిర్మించింది. వీటి ద్వారా మొత్తం 1000 ఎకరాలకు సాగు
మరమ్మతుల పాలైన కొత్తచెరువులు
అధికారుల స్పందన అవసరం
నాగులపల్లిలో గుట్టల మధ్యన నిర్మించిన మల్కన్దాన్ చెరువు
న్యూస్టుడే, పెద్దేముల్: అటవీ ప్రాంతంలో గుట్టలపై కురిసిన వర్షం నీరు వృథాగా పోకుండా ఒడిసిపడితే బీడు భూములను పచ్చటి పొలాలుగా మార్చవచ్చు. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలో రూ.7 కోట్లతో మూడు చెరువులను నిర్మించింది. వీటి ద్వారా మొత్తం 1000 ఎకరాలకు సాగు నీరు అందించాలన్నది సంకల్పం. ఏటా వానా కాలంలో ఇవి నిండినా ఫలితం ఉండటం లేదు. ఏళ్ల్లు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇందుకు కారణం...పర్యవేక్షణ లోపం, అధ్వాన నిర్వహణ. సాగుకు కొత్తగా జల వనరులు వస్తున్నాయని సంబరపడిన అన్నదాతలు నిరాశకు గురికాక తప్పడంలేదు. అదనంగా మిషన్ కాకతీయ ద్వారా నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం కలగడంలేదు. వానా కాలం సీజన్కు ఇక ఎంతో సమయం లేదు. కనీసం ఇప్పుడైనా చెరువులను పునరుద్ధరించి పంటలు పండించేందుకు ఉపయోగపడేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
అంబురామేశ్వర అడవిలో...
మండలంలోని సిద్ధన్నమడుగు తండా, తట్టేపల్లి సమీపంలోని అంబురామేశ్వర అడవిలో పెద్ద వాగుపై రెండు గుట్టల మధ్యన 2002లో కొత్తగా ఆత్కూరు చెరువును నిర్మించారు. ఇందుకు రూ.1.20 కోట్లను వెచ్చించారు. ఈ నిధులతో కట్ట, అలుగు, తూముల నిర్మాణం చేపట్టారు. నిధులు సరిపోవడం లేదని అదనంగా మరో రూ.20 లక్షలు కేటాయించారు. వీటితో కాల్వల నిర్మించినా, అప్పటి నుంచి ఎకరం భూమికి నీరు అందలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మిషన్ కాకతీయ కింద మరో రూ.50 లక్షలు మంజూరు చేశారు. వీటితో మెరుగులుదిద్ది మమ అనిపించారు. నాణ్యత లేకపోవడంతో తూములు శిథిలమయ్యాయి. కాల్వలు ఆనవాళ్లు కోల్పోయాయి. తూము నుంచి నీరంతా వృథా అవుతోంది. కుడి, ఎడమ కాల్వల ద్వారా 380 ఎకరాలకు సాగు అందాల్సి ఉన్నా, నిర్వహణ కొరవడింది.
ఇందూరు.. ఇబ్బందులమయం
ఇందూరు అటవీ ప్రాంతంలో గుట్టల కింది భాగంలో ఒట్టి వాగుపై రూ.కోటి నిధులతో 2005లో కొత్త చెరువును నిర్మించారు. 270 ఎకరాలకు సాగు నీటిని అందించాలన్నది లక్ష్యం. ఏడాదిలోనే కట్ట, అలుగు, తూముల నిర్మాణం పూర్తి చేశారు. కాల్వలను సరిగ్గా నిర్మించక పోవడంతో పొలాలకు నీరు చేరడం లేదు. మిషన్ కాకతీయ కింద రూ.50 లక్షలు మంజూరయ్యాయి. నామమాత్రంగా పనులు చేపట్టారు. తూములు, షట్టర్లు శిథిలమయ్యాయి. కాల్వలు నీరు రాక చెట్లు, పొదలతో పూడుకుపోయాయి. కుడి, ఎడమ కాల్వలకు గండ్లు పడ్డాయి. ఏళ్లు గడుస్తున్నా ఎకరం భూమికి సాగు నీరందని దుస్థితి నెలకొంది.
పదేళ్లుగా కాల్వల నిర్మాణానికే పరిమితం
ఆనవాళ్లు కోల్పోయిన ఇందూరు కాలువ
మండలంలోని నాగులపల్లి అటవీ ప్రాంతంలో కొత్తగా మల్కన్దాన్ చెరువు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. రూ.4 కోట్ల వ్యయంతో నిర్మాణానికి 2012లో శ్రీకారం చుట్టారు. నాలుగేళ్లుగా పనులు జోరుగా సాగాయి. కట్ట, అలుగు, తూములు పూర్తి చేశారు. కాల్వల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అందుకు రైతుల నుంచి భూ సేకరణ చేపట్టారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో అధికారులకు, రైతుల మధ్య చర్చలు జరిగాయి. పలుమార్లు జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు చెరువు ప్రదేశాన్ని సందర్శించారు. పరిహారం ఎంత అనే విషయంలో స్పష్టత రాలేదు. సాగునీరు పారితే తమ భూముల్లో పచ్చని పంటలు పండించి లాభాలు అర్జించవచ్చునని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
పునరుద్ధరణ పనులు చేపడతాం
నవీన్, ఏఈ, నీటిపారుదల శాఖ
కొత్తగా నిర్మించిన ఆత్కూరు, ఇందూరు చెరువులకు పునరుద్ధరణ పనులు చేపడతాం. కాల్వల స్థితిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. నాగులపల్లిలో చివరి దశలో ఉన్నాయి. కాల్వలకు భూసేకరణ చేసి పరిహారం చెల్ల్లిస్తే సమస్య తీరుతుంది. నిర్వాసితుల సమస్య పూర్తికాగానే పనులు మొదలు పెడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..