శరవేగంగా.. క్రీడా ప్రాంగణాల ఎంపిక
పల్లె ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీన్లో భాగంగా జిల్లాలోని అన్ని మారుమూల తండాల్లోనూ వీటి ఎంపికకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ
పల్లె ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీన్లో భాగంగా జిల్లాలోని అన్ని మారుమూల తండాల్లోనూ వీటి ఎంపికకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డీఆర్డీఏ అధికారులు, తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు ఎంపిక చేసిన స్థలాలను పరిశీలిస్తున్నారు. స్థలం కొరత ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ అందిస్తున్న కథనం.
ఉన్నవాటిలో సౌకర్యాల కొరత
ప్రస్తుతం జిల్లాలో పరిగి, తాండూరు పట్టణాల్లో మాత్రమే ప్రస్తుతం క్రీడా మైదానాలున్నాయి. వీటిలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పరిగిలో ఇటీవల కొత్తగా క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. కుల్కచర్లలో ఇండోర్ స్టేడియం ఉన్నా అది ఎవరికీ సరిగ్గా ఉపయోగపడటంలేదు. వికారాబాద్లో చిన్న పాటి మైదానం ఉంది. ఇక్కడా సరైన సౌకర్యాలు లేకపోయినా ఇందులోనే తరచుగా ఆటల పోటీలు జరుగుతున్నాయి. పల్లెల్లో సరియైన ఆటస్థలాలు లేక పోవడంతో ఆసక్తి ఉన్న క్రీడాకారుల ప్రతిభ వెలుగు చూడటంలేదు.
249 స్థలాల గుర్తింపు
జిల్లాలో బుధవారం నాటికి 249 గ్రామాల్లో రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అభివృద్ధి కోసం అప్పగించారు. ఈ శాఖకు చెందిన సిబ్బంది స్థలాలను పరిశీలించే పనులు చేపట్టారు. ఎకరానికి తక్కువ కాకుండా స్థలం ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బార్ (వ్యాయామం) కోసం కోర్టులను సిద్ధం చేయాల్సి ఉంది. ముందుగా స్థలాన్ని చదును చేసి పిచ్చి మొక్కలను తొలగించి క్రీడాకారులు వినియోగించుకునే విధంగా అనుకూలంగా మారుస్తారు. స్థల సమస్య ఉన్న పంచాయతీల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయనున్నారు. స్థలం చుట్టూ హరితహారంలో మొక్కలను నాటుతారు. నియోజక వర్గాల పరిధిలో పరిశ్రమలు ప్రతి ఏటా చెల్లించే కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సీఎస్ఆర్)నిధులతో క్రీడాకారులకు వసతులు సమకూర్చనున్నారు.
ఎంతో ఉపయోగం
కృష్ణన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, వికారాబాద్
జిల్లాలో ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణాలు క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడుతాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి మండలానికి రెండు గ్రామాల్లో క్రీడా మైదానాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పనులు శరవేగంగా చేస్తున్నాం. ఇప్పటిదాకా ఎంపిక చేసిన స్థలాలు అనుకూలంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం. అన్ని విధాలా క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?