తపాలా సేవలు ‘ప్రయోగాత్మకం’
సాంకేతికతను తపాలా శాఖ అందిపుచ్చుకుంటోంది. స్పీడ్, రిజిస్టర్ పోస్టులకు చిల్లర సమస్యలు ఎదురవుతుండటంతో క్యూఆర్ కోడ్తో చెల్లింపులు చేసేలా అడుగు ముందుకు వేసింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేలా తొలుత జిల్లా కేంద్ర తపాలా కార్యాలయాల్లో
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, వికారాబాద్ మున్సిపాలిటీ, మెదక్
సాంకేతికతను తపాలా శాఖ అందిపుచ్చుకుంటోంది. స్పీడ్, రిజిస్టర్ పోస్టులకు చిల్లర సమస్యలు ఎదురవుతుండటంతో క్యూఆర్ కోడ్తో చెల్లింపులు చేసేలా అడుగు ముందుకు వేసింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేలా తొలుత జిల్లా కేంద్ర తపాలా కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ విజయవంతమైతే ఇతర తపాలా కార్యాలయాల్లోనూ అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో పాటు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ను ప్రజలకు చేరువ చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కథనం.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని..
ప్రధాన తపాలా కార్యాలయాలు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, వికారాబాద్, తాండూరులో ఉన్నాయి. ప్రధాన తపాలా కార్యాలయాల్లో స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టులకు సంబంధించిన డబ్బులు క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ విధానంలో ప్రయోగాత్మకంగా చెల్లించేలా జిల్లా కేంద్రాల్లోని హెడ్ పోస్టాఫీసులలో ఇటీవల ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని, చిల్లర సమస్యను అధిగమించాలనేది ప్రధాన లక్ష్యం.
బీమా చేయించేలా..
పోస్ట్లల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలను పెంచేలా తపాలా శాఖ చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ స్థాయిలో ఏజెంట్లను నియమించి వీటికి సంబంధించి అవగాహన కల్పిస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా వారికి కమీషన్ చెల్లించి ప్రోత్సహించేలా కసరత్తు చేస్తున్నారు. నెల, మూడు, ఆరు, సంవత్సరం.. ఇలా విడతల్లో చెల్లించే సదుపాయం కల్పించారు. నెల నెలా చెల్లించే మొత్తం ఏడాది ముందుగానే కడితే రెండు శాతం తగ్గింపు సదుపాయం ఉంది. సాధ్యమైనంత ఎక్కువ మందితో బీమా చేయించేలా చర్యలు చేపడుతున్నారు.
ఉమ్మడి మెదక్, వికారాబాద్లో 1.82 లక్షల ఖాతాలు
తపాలా శాఖ ఇతర సేవలను కూడా అందిస్తోంది. ఖాతాలో డబ్బులు జమ చేయడం, రికరింగ్ డిపాజిట్లు, ఉత్తరాలు అందించడం వరకు మాత్రమే తపాలా సేవలు పరిమితం అయ్యేవి. కాలానుగుణంగా ఆయా సేవలను విస్తరిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతోంది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 1,82,190 ఖాతాలు ఉన్నాయి. 10 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న బాలికల పేరు మీద ఖాతా తీసుకోవచ్చు. ఆశీర్వాదం పేరుతో ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి ప్రసాదాలు తీసుకువస్తూ.. వినియోగదారులకు అందజేస్తున్నారు. వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా విదేశాల నుంచి పంపిన డబ్బులను తపాలా ద్వారా తీసుకోవచ్చు.
ప్రజలకు మరింత చేరువ కావాలని..: విజయ్కుమార్, పోస్టల్ సూపరింటెండెంట్, సంగారెడ్డి
తపాలా శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ పథకాలతో పాటు కొత్త కార్యక్రమాలతో మరింత చేరువ అవుతున్నాం. పోస్టల్ పేమెంట్ బ్యాంక్తో పాటు ఏటీఎం సేవలు అమలు చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM