logo

చార్‌ధామ్‌ యాత్రలో షేక్‌పేట్‌ వాసి మృతి

చార్‌ధామ్‌యాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం అలముకుంది. గంగోత్రినదిలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి షేక్‌పేట్‌కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ నగరంలోని షేక్‌పేట్‌, మారుతీనగర్‌కాలనీకి

Published : 27 May 2022 03:27 IST


పూస అశోక్‌

గోల్కొండ, న్యూస్‌టుడే: చార్‌ధామ్‌యాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం అలముకుంది. గంగోత్రినదిలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి షేక్‌పేట్‌కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ నగరంలోని షేక్‌పేట్‌, మారుతీనగర్‌కాలనీకి చెందిన పూస అశోక్‌ (65) బీఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగి. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. వారం క్రితం అశోక్‌ కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి చార్‌ధామ్‌యాత్రకు వెళ్లారు. బుధవారం గంగోత్రినదిలో స్నానానికి దిగిన అశోక్‌ నీటి ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. సమీపంలోని ఓ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. అతని మృతదేహాన్ని శుక్రవారం ఉదయం విమానంలో నగరానికి తీసుకువస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని