Hyderabad: బేగంబజార్ హత్య కేసు: పోలీసు కస్టడీకి ఇద్దరు నిందితులు
బేగంబజార్లో యువ వ్యాపారి నీరజ్ పన్వర్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయ్, సంజన్ అనే ఇద్దరు నిందితులను కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతించింది.
హైదరాబాద్: బేగంబజార్లో యువ వ్యాపారి నీరజ్ పన్వర్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయ్, సంజన్ అనే ఇద్దరు నిందితులను కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన జరిగిన నీరజ్ హత్య కేసులో షాహినాయత్ గంజ్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. 22వ తేదీన నలుగురిని అరెస్టు చేశారు. ఇందులో విజయ్, సంజయ్, రోహిత్, ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అభినందన్, మహేష్ పరారీలో ఉండటంతో మరుసటి రోజు వాళ్లిద్దరితో పాటు... మరో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 22న అరెస్టు చేసిన నలుగురిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరినా.. హత్యతో నేరుగా సంబంధం ఉన్న విజయ్, సంజయ్లను మాత్రమే కస్టడీకి అనుమతించింది.
విజయ్, సంజయ్లను ప్రశ్నించి హత్యకు గల కారణాలను పూర్తిగా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్యతో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. 22న అరెస్టు చేసిన అభినందన్, మహేష్, ప్రశాంత్లను కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే వీళ్లను కూడా కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించేందుకు అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.