logo

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలువురు న్యాయమూర్తుల బదిలీ

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న పలువురు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. వికారాబాద్‌ 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి జయప్రసాద్‌ను రంగారెడ్డిజిల్లా 13వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ చేశారు.

Published : 28 May 2022 01:23 IST

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న పలువురు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. వికారాబాద్‌ 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి జయప్రసాద్‌ను రంగారెడ్డిజిల్లా 13వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఈ స్థానంలో ఉన్న శ్రీనివాసాచారి భూపాలపల్లికి బదిలీ అయ్యారు. రంగారెడ్డిజిల్లా 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి వై.పద్మ మహబూబ్‌నగర్‌కు బదిలీ కాగా ఈ స్థానానికి నిర్మల్‌ నుంచి హరీశ్‌ వస్తున్నారు. రంగారెడ్డిజిల్లా 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి శైలజ వరంగల్‌కు బదిలీ కాగా ఇక్కడికి గద్వాల్‌ నుంచి శివకుమార్‌ బదిలీ అయ్యారు. మేడ్చల్‌ 11వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఉన్న రఘురాం మెదక్‌ వెళ్తుండగా ఈయన స్థానంలో వరంగల్‌ నుంచి బి.సురేష్‌ వస్తున్నారు. మల్కాజిగిరిలో 16వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న బాలభాస్కర్‌రావు భువనగిరికి బదిలీ కాగా ఈయన స్థానంలో మంచిర్యాల్‌లో ఉన్న వెంకటేశ్‌ నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి మంజరి సికింద్రాబాద్‌కు, 5వ అదనపు జిల్లా న్యాయమూర్తి సత్తయ్య మంచిర్యాల్‌కు, 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి గౌతం ప్రసాద్‌ సూర్యాపేటకు బదిలీ కాగా ఈ ముగ్గురి స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని