logo

Suicide: మీ కోరిక సంతోషంగా తీరుస్తా.. భర్తకు లేఖ రాసి భార్య ఆత్మహత్య

‘మీ కోరిక నేను చనిపోవడమే కదా.. సంతోషంగా తీరుస్తా..’ అంటూ ఓ మహిళ భర్తకు లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడింది. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం..

Updated : 28 May 2022 11:03 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ‘మీ కోరిక నేను చనిపోవడమే కదా.. సంతోషంగా తీరుస్తా..’ అంటూ ఓ మహిళ భర్తకు లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడింది. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. రహమత్‌నగర్‌ డివిజన్‌ కార్మికనగర్‌లో ఉంటూ వడ్రంగి పనిచేసే మీరా సాహెబ్‌ తన అక్క కుమార్తె సంధ్య(19)ని వివాహం చేసుకున్నాడు. గురువారం భర్త తిట్టాడని, తల్లిని కొట్టాడని.. సంధ్య శుక్రవారం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్‌ ఎస్సై రాజశేఖర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి సంధ్య రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె.. ‘బాబాయ్‌ నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను, మీ ఇంటి గుమ్మంలో శాశ్వతంగా అడుగుపెట్టను, నువ్వు సంతోషంగా ఉండు’ అని రాసింది. తన భర్తనుద్దేశించి.. ‘మామయ్య.. నీకు రుణపడి ఉంటా.. నేను చేసిన తప్పల్లా తల్లి మాట విని ఏడడుగులు వేయడమే, అప్పట్నుంచి నరకం అనుభవించా.. నేను చేసిన తప్పు ఫోన్‌ చేయడం, నా మొదటి తప్పుగా మన్నించావు, ఆ క్షణంలోనే నేను మారాను. గురువారం అనుకోని పరిస్థితుల్లో అమ్మతో కలిసి ఆ ఆటోలో వచ్చాను, నన్ను తిట్టావు.. మా అమ్మను కొట్టావు.. నీ కోరిక ప్రకారమే చచ్చిపోతున్నా’ అని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని