logo

డెంగీతో ఒకరి మృతి

డెంగీ బారిన పడిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌కు చెందిన బుర్ర నర్సింహులుగౌడ్‌(58) కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

Published : 28 May 2022 01:23 IST

బండ్లగూడజాగీర్‌, న్యూస్‌టుడే: డెంగీ బారిన పడిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌కు చెందిన బుర్ర నర్సింహులుగౌడ్‌(58) కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారం రోజుల క్రితం జ్వరంగా ఉండటంతో నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు డెంగీకి గురైనట్లు తేల్చి చికిత్స ప్రారంభించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు