logo

కళ్లకు జండూ బాం పూసి బంగారు గొలుసు అపహరణ

కిరాణా దుకాణం యజమాని కళ్లకు జండూ బాం పూసి బంగారు గొలుసు, జేబులోని రూ.13వేల నగదు ఓ అగంతకుడు ఎత్తుకు పోయాడు. సంజీవరెడ్డినగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 28 May 2022 01:23 IST

సంజీవరెడ్డినగర్‌, న్యూస్‌టుడే: కిరాణా దుకాణం యజమాని కళ్లకు జండూ బాం పూసి బంగారు గొలుసు, జేబులోని రూ.13వేల నగదు ఓ అగంతకుడు ఎత్తుకు పోయాడు. సంజీవరెడ్డినగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ స్వర్ణపురి కాలనీ రాజీవ్‌నగర్‌కు చెందిన కాజపు శ్రీనివాస్‌(53) శ్రీరాంనగర్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో దుకాణంలోని వ్యర్థా.లను సమీపంలో పారబోసి వస్తుండగా వెనుక నుంచి ఓ అగంతకుడు వచ్చి శ్రీనివాస్‌ కళ్లలో జండూ బాం పూశాడు. ఆయన మెడలోని తులం బంగారు గొలుసు, ప్యాంటు జేబులో ఉన్న రూ.13వేల నగదు లాక్కుని పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని