logo

నీరజ్‌ పన్వర్‌ హత్య కేసులో పోలీసు కస్టడీకి ఇద్దరు నిందితులు

బేగంబజార్‌లో ఇటీవల జరిగిన నీరజ్‌ పన్వర్‌ హత్య కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది.

Published : 28 May 2022 01:51 IST

అబిడ్స్‌, న్యూస్‌టుడే: బేగంబజార్‌లో ఇటీవల జరిగిన నీరజ్‌ పన్వర్‌ హత్య కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ మేరకు హత్య కేసులో షాయినాయత్‌గంజ్‌ పోలీసులు మొత్తం ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఏ2 విజయ్‌, ఏ4 సంజయ్‌లను 4రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ మేరకు షాయినాయత్‌గంజ్‌ పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకొని పోలీసుస్టేషన్‌లో విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని