మంచి తరుణం
జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది మండలాల్లోని సంఘాలకు సెర్ప్ ద్వారా, పట్టణ ప్రాంతల్లో మెప్మా ద్వారా స్త్రీనిధి రుణాలు అందజేస్తున్నారు. సంఘాల్లో నమోదైన వారికి మిగిలిన సభ్యుల రుణాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మంజూరు చేస్తున్నారు.
పెరిగిన స్త్రీనిధి లక్ష్యం
వేగం పెంచితేనే ప్రయోజనం
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ
మహిళలు నిర్వహిస్తున్న దుకాణాన్ని పరిశీలిస్తున్న అధికారులు
మహిళాభ్యున్నతికి సర్కారు వివిధ పథకాలను ప్రారంభించి వారి భవితకు బాటలు వేస్తోంది. స్వయం ఉపాధితో ముందుకు సాగేందుకు సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగానే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అడిగిన వెంటనే వీరికి స్త్రీనిధిని మంజూరు చేస్తున్నారు. ఈసారి మొత్తాన్ని భారీగా పెంచి, వందల మందికి అదనంగా పొందే అవకాశాన్ని కల్పించారు. సంఘాల్లో సభ్యులైన వారంతా సద్వినియోగం చేసుకోనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, పంపిణీలో వేగం పెంచితేనే లక్ష్యం చేరే ఆస్కారముంటుంది. వేలాది మందికి ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఈనేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం...
జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది మండలాల్లోని సంఘాలకు సెర్ప్ ద్వారా, పట్టణ ప్రాంతల్లో మెప్మా ద్వారా స్త్రీనిధి రుణాలు అందజేస్తున్నారు. సంఘాల్లో నమోదైన వారికి మిగిలిన సభ్యుల రుణాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మంజూరు చేస్తున్నారు. రూ.25వేల నుంచి రూ.3లక్షల వరకు పొందే వెసులుబాటు కల్పించారు. 48గంటల నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఇచ్చేలా నిబంధన అమలు చేస్తున్నారు. చరవాణి ద్వారా అర్జీ చేస్తే సత్వరమే స్పందిస్తూ, సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి, పారదర్శకతకు శ్రీకారం చుట్టడంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.
మొదటి త్రైమాసికంలో మందగమనం
ఈ ఆర్థిక సంవత్సరం రూ.78.30 కోట్లు అందించేందుకు సన్నాహాలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా రూ.11.39 కోట్లను అదనంగా అందించబోతున్నారు. అత్యధికంగా దోమ మండలంలో రూ.5.41 కోట్లు, మోమిన్పేటలో రూ.4.86 కోట్లు, అత్యల్పంగా ధారూరు మండలంలో రూ.1.11 కోట్లు అందించేందుకు లక్ష్యం ఖరారు చేశారు. కరోనా సమయంలో విరివిగా అందించిన అధికారులు వంద శాతానికి మించి పంపిణీ చేశారు. ఆ తర్వాత, అంతకుముందు సంవత్సరాల్లో శతశాతం లక్ష్యం చేరుకోలేదు. మొదటి, రెండో త్రైమాసికాల్లో ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. వేగవంతం చేస్తే వంద శాతం పూర్తి చేసే వీలుంటుంది. ఆ దిశగా సీసీలు, వీఓఏలు, ఏపీఎంలు చొరవ చూపాల్సి ఉంది. ఈసారి గ్రామాల్లో 3.36 శాతం, పట్టణాల్లో 9.34శాతం పంపిణీ పూర్తైంది.
ఎంపిక చేసిన యూనిట్లు ఇవే..
అలంకరణ వస్తువిక్రయాలతో..
గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువ శాతం అలంకరణ వస్తువుల విక్రయం, పిండి మరలు, కిరాణం, మిఠాయిలు, దుస్తుల విక్రయ దుకాణాలు, పాడి పశుపోషణ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. వీటిని నెలకొల్పేందుకు రూ.50వేల నుంచి రూ.2లక్షల దాకా ఖర్చవుతోంది. రుణం పొంది వీటిని ప్రారంభించి అభివృద్ధి చెందుతున్నారు. వచ్చే ఆదాయం నుంచి వాయిదాలు చెల్లిస్తూ క్రమశిక్షణ పాటిస్తున్నారు. అరవై నెలల్లో తీర్చేందుకు వెసులుబాటు కల్పించడం కలిసొచ్చింది.
గంటల్లోనే మంజూరు : తుమ్మల వేణు, మెప్మా, స్త్రీనిధి జిల్లా మేనేజరు
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు దరఖాస్తు చేసిన గంటల వ్యవధిలో రుణం మంజూరు చేస్తున్నాం. రూ.లక్షకు మించి ఉంటే వారంపదిరోజుల్లో ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఆసక్తి ఉన్న యూనిట్లను ఏర్పాటు చేయించి సద్వినియోగం చేసేలా ప్రోత్సహిస్తున్నాం.
ఎప్పటికప్పుడు పర్యవేక్షణ : కృష్ణన్, డీఆర్డీవో
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబరు నెలాఖలోగా వంద శాతం పంపిణీ చేసేలా మండల, గ్రామ స్థాయి అధికారులను ఆదేశించాం. మంజూరుపై నెలనెలా సమీక్షిస్తాం. దరఖాస్తు చేసిన సభ్యులకు రూ.3లక్షల దాకా ఇస్తాం. యూనిట్లను, వ్యాపారాలను సాఫీగా నిర్వహించేలా పర్యవేక్షణ చేయిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
నేతలు రోడ్డెక్క.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇంధనం ఏదమ్మాఝ
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా