Suicide: తండ్రి దశదినకర్మకు డబ్బులు లేక తనయుడి ఆత్మహత్య

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

Updated : 28 May 2022 14:14 IST

శామీర్‌పేట్‌: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆదివారం(రేపు) తన తండ్రి దశదినకర్మ నిర్వహించేందుకు డబ్బుల్లేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శామీర్‌పేట సీఐ సుధీర్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మూడుచింతపల్లి మండలం అద్రాస్‌పల్లి గ్రామానికి చెందిన నర్సింహ(30) తండ్రి యాదయ్య వారం కిందట మృతి చెందాడు.

ఆయన దశదినకర్మను ఆదివారం నిర్వహించాల్సి ఉంది. కార్యక్రమం నిర్వహించేందుకు డబ్బు లేకపోవడంతో నర్సింహ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న శామీర్‌పేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని