అభివృద్ధికి నిధుల గండం...అప్పులతో సతమతం
బషీరాబాద్ మండలంలో ఓ సర్పంచి అప్పులు తెచ్చి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేశారు. ఐదు మాసాల నుంచి బిల్లులు అందకపోవడం, రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవడంతో ఎకరా పొలం అమ్మి అప్పులు చెల్లించడం చర్చనీయాశంగా మారింది.
నిలిచిన రూ.50 కోట్లు
ఐదు నెలలుగా చెక్కులకు కలగని మోక్షం
* బషీరాబాద్ మండలంలో ఓ సర్పంచి అప్పులు తెచ్చి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేశారు. ఐదు మాసాల నుంచి బిల్లులు అందకపోవడం, రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవడంతో ఎకరా పొలం అమ్మి అప్పులు చెల్లించడం చర్చనీయాశంగా మారింది.
* ధారూర్ మండలంలోని ఓ గ్రామంలో పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు కలిపి నెలకు రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. ఐదు నెలలుగా బిల్లులకు మోక్షం కలగక పోవడంతో ఆ సర్పంచి అప్పులు తెచ్చి ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు.
- జిల్లాలో చాలా మంది సర్పంచులు ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
న్యూస్టుడే, వికారాబాద్
‘గ్రామాలే అభివృద్ధికి పట్టుగొమ్మలు.’ ఇందుకోసం సర్పంచులు, ప్రజా ప్రతినిధులు నిరంతరం కృషిచేయాలి. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రావాలి. తద్వారా ప్రగతి పనులు చకచకా సాగుతాయి. జిల్లాలో ఈ తరహా వాతావరణం కనిపించడంలేదు. సర్పంచులు వడ్డీకి తెచ్చి అభివృద్ధికి వెచ్చించాల్సి వస్తోంది. జిల్లాలో ఐదు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. చేసిన ఖర్చులకు కోశాధికారి కార్యాలయం (ట్రెజరీ)లో చెక్కులు జమ చేసినా ఉపయోగం ఉండటం లేదు. నెలకు రూ.10 కోట్ల చొప్పున ఐదు మాసాలకు రూ.50 కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. దీంతో ఖాతాలో నిధులున్నా ప్రభుత్వం అనధికార ఫ్రీజింగ్ పెట్టడంతో డ్రా చేసుకోవడానికి వీలు కావడం లేదు. నిధుల లేమి కారణంగా త్వరలో చేపట్టే ‘పల్లె ప్రగతి’పై ప్రభావం పడక తప్పదని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
నెలకు రూ.లక్ష వరకు ఖర్చు..
పంచాయతీల నిర్వహణ మొత్తం సర్పంచులే చూసుకుంటారు. ట్రాక్టర్లకు డీజిల్, వీధి దీపాలు, బోరుమోటార్ల మరమ్మతులు, కార్మికుల జీత భత్యాలు వారే చూసుకుంటున్నారు. చెక్కులు మంజూరైన తర్వాత తీసుకోవచ్చనే ధీమాతో అప్పులు తెచ్చి ఆగకుండా పనులు నడిపిస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో మెజార్టీ సర్పంచులు అధికార పార్టీలోనే కొనసాగుతున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగస్వామ్య మవుతున్నారు. బిల్లులు రావడం లేదని బయటకు చెప్పినా అంతగా ప్రయోజనం ఉండదని మౌనం వహిస్తున్నట్లు కొందరు సర్పంచులు వాపోయారు.
రెండోసారి పంపినా..
పంచాయతీల ఖర్చులకు సంబంధించిన చెక్కులను ఈ ఏడాది జనవరి నుంచి కోశాధికారి కార్యాలయానికి పంపిస్తున్నారు. చెక్కుల కాల పరిమితి మూడు నెలలు మాత్రమే ఉండటంతో మార్చి వరకు పంపినవి చెల్లుబాటు కాకుండా పోయాయి. ఏప్రిల్లో రెండోసారి పంపించారు. ఇంతలో ప్రభుత్వం నిలిపివేత (ఫ్రీజింగ్) నిబంధన పెట్టడంతో మోక్షం కలగడం లేదు. కేవలం విద్యుత్తు బిల్లులకు సంబంధించిన చెక్కులు మాత్రమే చెల్లుబాటవుతున్నాయి. గతంలో పంచాయతీ కార్మికుల వేతనాలు ప్రతి నెల 5వ తేదీలోపు వచ్చేవి. అవికూడా ఐదు నెలలుగా నిలిచిపోయాయి.
ఆర్థిక భారంతో సతమతం
- శ్రీనివాస్రెడ్డి, అధ్యక్షుడు, మండల సర్పంచుల సంఘం, మోమిన్పేట
బిల్లులు మంజూరు కాకపోవడంతో సర్పంచులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. పనులు చేసినా బిల్లులు రావడం లేదన్న కారణంతో సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంటోంది. ఈ పరిణామం గ్రామాభివృద్ధికి అవరోధంగా మారుతోంది. అందుకే పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులు అందేలా చూడాలి.
త్వరలో మంజూరవుతాయి
- మల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి
పంచాయతీల చెక్కులు క్లియర్ కాకపోవడం వాస్తవమే. వివిధ పనుల తాలూకూ అపరిష్కృత బిల్లులు త్వరలో మంజూరు కానున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ముందు వేసిన చెక్కుల కాలపరిమితి ముగియడంతో మరోమారు కోశాధికారి కార్యాలయానికి పంపించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డబ్బులు డ్రా కావడం లేదు. చెక్కులన్నీ ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.