పోలీసుల బుట్టలో మోసగాడు
ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచిన విలువైన కెమెరాలను తప్పుడు ఐడీలతో అద్దెకు తీసుకుని విక్రయించిస్తున్న సైబర్ నేరగాడిని తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు సైతం ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇవ్వగా అది చూసి బేరమాడేందుకు వచ్చి
తప్పుడు ఐడీలతో కెమెరాలు అద్దెకు తీసుకుని విక్రయం
కెమెరాలను చూపిస్తున్న డీసీపీ చందనదీప్తి
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచిన విలువైన కెమెరాలను తప్పుడు ఐడీలతో అద్దెకు తీసుకుని విక్రయించిస్తున్న సైబర్ నేరగాడిని తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు సైతం ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇవ్వగా అది చూసి బేరమాడేందుకు వచ్చి నిందితుడు దొరికిపోయాడు. నిందితుడి వద్ద నుంచి రూ.5.5లక్షల విలువైన 10కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నార్త్జోన్ డీసీపీ చందనదీప్తి శనివారం ఏసీపీ సుధీర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంబటి అంజనేయులుతో కలిసి వివరాలు వెల్లడించారు. వనపర్తి పట్టణం న్యూటౌన్ కాలనీకి చెందిన గంగిడి కిరణ్కుమార్ యాదవ్(27) సాప్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఓఎల్ఎక్స్లో అద్దెకు, విక్రయించించేందుకు ఉంచిన వాళ్లను గుర్తించి తప్పుడు గుర్తింపు, ఆధార్కార్డులు చూపించి రోజుకు రూ.వెయ్యి చొప్పున అద్దె చెల్లిస్తానంటూ నమ్మకం కుదిరేందుకు కొంత డబ్బును అడ్వాన్స్గా చెల్లిస్తాడు. ఆ కెమెరాలను విక్రయిస్తూ జల్సాగా గడుపుతున్నాడు. ఈనెల 6న తుకారాంగేట్లో ఉండే విద్యార్థి సాత్విక్ ఆన్లైన్లో విక్రయించేందుకు కెమెరా ఉంచగా కిరణ్కుమార్ అద్దెకిస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని నమ్మించాడు. రెండు రోజుల అద్దె ఇచ్చి కెమెరా తీసుకుని వెళ్లాడు. తరువాత నిందితుడి ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో తుకారంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.