HYD News: గచ్చిబౌలిలో స్విగ్గీ డెలివరీ బాయ్పై 20మంది దాడి
నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని ఓ హోటల్ యాజమాన్యం దౌర్జన్యంగా ప్రవర్తించింది. స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి చేసింది.
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఓ హోటల్ యాజమాన్యం దౌర్జన్యంగా ప్రవర్తించింది. స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి చేసింది. ఫుడ్ సర్వీస్ కోసం డెలివరీ బాయ్ అరగంట పాటు హోటల్ వద్ద ఎదురుచూశాడు. ఫుడ్ ఆలస్యం కావడంతో హోటల్ యజమానిని అడిగాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్పై యజమానితో సహా హోటల్ సిబ్బంది 20 మంది రాడ్లు, కర్రలతో దాడి చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన డెలివరీ బాయ్ను ఆస్పత్రికి తరలించారు. డెలివరీ బాయ్పై దాడి నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయాలంటూ హోటల్ ముందు స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. హోటల్ యాజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐరాసలో బషీరాబాద్ యువకుడి ప్రసంగం
[ 30-03-2024]
స్విట్జర్ల్యాండ్లోని జెనీవాలో మార్చి 11 నుంచి 23 వరకు జరిగిన 55వ ఐక్యరాజ్యసమితి మానవ హక్కులు సమావేశంలో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం బద్లాపూర్కు చెందిన సాయి సంపత్ పాల్గొన్నారు. -
‘కారు’లోనే ఉండండి.. స్టీరింగ్ మా ‘చేతి’కివ్వండి!
[ 30-03-2024]
రాజధాని పరిధిలోని నాలుగు లోక్సభ స్థానాల్లో మూడింటిలో గెలిచేందుకు కాంగ్రెస్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. -
అభివృద్ధి చేసేలోపు.. నదిని మూసేద్దామని!
[ 30-03-2024]
మూసీ అభివృద్ధికి ఓ వైపున పనులు వేగంగా జరుగుతుంటే.. అంతే జోరుగా నది ఆక్రమణ కొనసాగుతోంది. -
హెచ్ఎండీఏలో కదులుతున్న టీడీఆర్ డొంక
[ 30-03-2024]
హెచ్ఎండీఏలో ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) వ్యవహారం డొంక కదులుతోంది. -
పాతాళంలోకి పడిపోతున్నాయ్
[ 30-03-2024]
గ్రేటర్ వ్యాప్తంగా భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రధాన నగరంతోపాటు శివార్లలో కూడా అదే పరిస్థితి నెలకొంది. -
మే నెల రికార్డులు.. మార్చిలోనే బద్దలు
[ 30-03-2024]
గ్రేటర్లో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్తు వినియోగం నమోదైంది. ఎండల కారణంగా గతేడాది మే నెలలో వినియోగం రికార్డులను ఈ ఏడాది మార్చిలోనే బద్దలు కొట్టింది. -
భానుడు @42 డిగ్రీలు
[ 30-03-2024]
నగరంలో ఎండలు మండిపోతున్నాయి.. మార్చి నెలలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ఆ 2 వేల మంది ఎక్కడ?
[ 30-03-2024]
లేని కార్మికులను ఉన్నట్టుగా చూపి ప్రతినెలా రూ.లక్షల్లో జీతాలు కొల్లగొట్టే ముఠాలకు గడ్డు కాలం వచ్చినట్టేనా.. నకిలీ వేలిముద్రలతో ప్రజాధనాన్ని దోచుకుంటోన్న అధికారులకు చెక్ పెట్టినట్టేనా.. అంటే అవుననే సమాధానం తెలుస్తోంది. -
ఏం కాదనుకునేరు.. ఫైర్
[ 30-03-2024]
రాజధాని పరిధిలోని మూడు జిల్లాల్లో ఏటా 1400కి పైగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. -
గృహ నిర్మాణ సముదాయంలో నిర్లక్ష్యపు పేలుళ్లు
[ 30-03-2024]
నిర్మాణంలో ఉన్న గృహ సముదాయ ఆవరణలో ముందస్తు హెచ్చరికలు లేకుండా నిర్లక్ష్యంగా జరిపిన బ్లాస్టింగ్లో ఓ కార్మికుడు దుర్మరణం చెందగా మరొకరు చికిత్స పొందుతున్నారు. -
నిలువ నీడ.. యాడ?
[ 30-03-2024]
బస్షెల్టర్ల ఏర్పాటులో జాప్యం, నిర్వహణ లోపం కారణంగా ఆర్టీసీ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. -
బరువు సరిపోతే లైసెన్స్ ఖాయం!
[ 30-03-2024]
తూనికలు కొలతల శాఖలో లైసెన్స్హోల్డర్ల నియామకంలో అధికారులు నిబంధనలు విస్మరిస్తున్నారని.. డ్రైవర్లు, తమ సహాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. -
వ్యూహ రచన.. గెలుపు యోచన
[ 30-03-2024]
చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో గెలుపు బావుటా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. -
సమష్టి కృషి.. ప్రథమ స్థానంతో మురిసి..
[ 30-03-2024]
ఉపాధి హామీ పథకంలో అన్ని అనుబంధ ప్రమాణాల్లో (ప్యారామీటర్స్) రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా ఎక్కువ సంఖ్యను సాధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. -
మిషన్ శక్తి.. మహిళా దీప్తి
[ 30-03-2024]
మహిళలు, బాలికల భవితకు బాటలు వేసేందుకు సర్కార్ కృషి చేస్తోంది. ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదంతో వారిలో చైతన్యం తెస్తోంది. -
కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తున్నారు: కొండా
[ 30-03-2024]
గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించాయని చేవెళ్ల పార్లమెంట్ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
ప్రజల కోసమే యాగం: ప్రసాద్కుమార్
[ 30-03-2024]
రాష్ట్ర, జిల్లా, వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. -
మల్కాజిగిరిలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలి
[ 30-03-2024]
మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంపై మరోమారు కాంగ్రెస్ జెండా ఎగరాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
దేశ రక్షణ, అభివృద్ధి భాజపాతోనే సాధ్యం
[ 30-03-2024]
దేశరక్షణ, సమగ్ర అభివృద్ధి ఒక్క భాజపాతోనే సాధ్యమని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
యువశ్రామిక శక్తితో భారత మార్కెట్లో సరికొత్త అవకాశాలు
[ 30-03-2024]
భారతదేశంలో ఉన్న అపారమైన యువశ్రామిక శక్తి సరికొత్త వ్యాపార మార్గాలకు తలుపులు తెరిచిందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) డిప్యూటీ డైరెక్టర్ సతోషి ససాకి అన్నారు. -
జీవన విలువలు చూపే దర్పణం రామాయణం
[ 30-03-2024]
మానవ జీవన విలువలను చూపే దర్పణం రామాయణమని ఆధ్వాత్మికవేత్త చినజీయర్ స్వామి అన్నారు. -
మున్సిపల్ సిబ్బందిపై రాళ్లతో దాడి
[ 30-03-2024]
రాజేంద్రనగర్ సర్కిల్లో ప్రదాన రహదారిపై కొబ్బరిబొండాలను విక్రయించేవారు మున్సిపల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. -
హత్యా.. ఆత్మహత్యా?
[ 30-03-2024]
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందింది. షాయినాయత్గంజ్ ఎస్సై లక్ష్మయ్య వివరాల ప్రకారం..