logo

HYD News: గచ్చిబౌలిలో స్విగ్గీ డెలివరీ బాయ్‌పై 20మంది దాడి

నగరంలోని గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలోని ఓ హోటల్‌ యాజమాన్యం దౌర్జన్యంగా ప్రవర్తించింది. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి చేసింది. 

Updated : 22 Nov 2022 15:23 IST

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో ఓ హోటల్‌ యాజమాన్యం దౌర్జన్యంగా ప్రవర్తించింది. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి చేసింది. ఫుడ్‌ సర్వీస్‌ కోసం డెలివరీ బాయ్‌ అరగంట పాటు హోటల్‌ వద్ద ఎదురుచూశాడు. ఫుడ్‌ ఆలస్యం కావడంతో హోటల్‌ యజమానిని అడిగాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్‌పై యజమానితో సహా హోటల్‌ సిబ్బంది 20 మంది రాడ్లు, కర్రలతో దాడి చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన డెలివరీ బాయ్‌ను ఆస్పత్రికి తరలించారు. డెలివరీ బాయ్‌పై దాడి నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయాలంటూ హోటల్‌ ముందు స్విగ్గీ డెలివరీ బాయ్స్‌ ఆందోళనకు దిగారు. హోటల్‌ యాజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని