పాద బాట.. పక్క బాట
సుందరీకరణలో భాగంగా నగరవ్యాప్తంగా నిర్మించిన పాదబాటలు నడిచేందుకు వీల్లేకుండా తయారయ్యాయి. చిరు వ్యాపారుల ఆక్రమణలు, వ్యర్థాల పారబోత, పైపులతో నిండిపోయాయి. అక్కడివరకు నడుచుకుంటూ వచ్చి అడ్డంకులు ఉండడంతో రోడ్డు మీద నడవాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని
అడుగడుగునా అడ్డంకులు, వ్యాపారాలు
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడవాల్సిన దుస్థితి
ఈనాడు, హైదరాబాద్
సికింద్రాబాద్-చిలకలగూడ మార్గంలో...
సుందరీకరణలో భాగంగా నగరవ్యాప్తంగా నిర్మించిన పాదబాటలు నడిచేందుకు వీల్లేకుండా తయారయ్యాయి. చిరు వ్యాపారుల ఆక్రమణలు, వ్యర్థాల పారబోత, పైపులతో నిండిపోయాయి. అక్కడివరకు నడుచుకుంటూ వచ్చి అడ్డంకులు ఉండడంతో రోడ్డు మీద నడవాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళనతో ముందుకు సాగుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు కాలిబాటల పరిస్థితి దారుణంగా కనిపించింది.
పైపులు.. సామగ్రి డంపింగ్
అధికారుల పర్యవేక్షణ లోపం.. నిర్లక్ష్యం కారణంగా ఏళ్లుగా కాలిబాటలు ఆక్రమణల చెరలో చిక్కుకున్నాయి. రూ.కోట్లు వెచ్చించి ఆధునికీకరించిన ప్రాంతాల్లోనూ పనుల్లో నాణ్యతలేమి వల్ల టైల్స్ పైకి లేచి.. గుంతలు ఏర్పడి కాలు మోపలేని విధంగా తయారయ్యాయి. వివిధ పనుల నిమిత్తం పైపులు, ఇతర సామగ్రి డంప్ చేస్తున్నారు. నెలల తరబడి తొలగించడంలేదు.
కాపాడాల్సినోళ్లే కబళిస్తుంటే..
రహదారులను అభివృద్ధి చేసి కాలిబాటలను నిర్మించాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీపై ఉంది. కొత్తగా రోడ్లు అభివృద్ధి చేస్తున్నా.. పాదబాటలు అభివృద్ధి చేసే విషయాన్ని పట్టించుకోవడం లేదు. 100 అడుగుల మార్గాలు 80 అడుగులకు కుంచించుకుపోయినా స్థానిక నేతలకు తలొగ్గి చోద్యం చూస్తున్నారు. నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డులో కాలిబాట 20 శాతానికి మించి లేదు. స్వయంగా జీహెచ్ఎంసీ సుమారు 50 ప్రాంతాల్లో పాదబాటలపై రూ.5 భోజన కేంద్రాలు ఏర్పాటు చేసింది. విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్ వైర్ల స్తంభాలు, చెట్లు, కుండీలు, బస్టాపులు.. ఇలా చాలావాటికి నిలయం పాదబాటలే. రూ.65 కోట్లతో కొనుగోలు చేసిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్రజా మరుగుదొడ్లను మూడేళ్ల క్రితం కాలిబాటలపై ఏర్పాటు చేయగా.. నిరుపయోగంగా మారి సెప్టిక్ ట్యాంకుల్లా తయారయ్యాయి. వాటర్ ఏటీఎం డబ్బాలది ఇదే పరిస్థితి.
పెలికాన్ సిగ్నళ్లు ఎక్కడ?
నగరంలో పాదబాట సరిగా లేక, రోడ్లు దాటే సమయంలో పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటుతున్నారు. వంద చోట్ల పెలికాన్ సిగ్నల్స్ అవసరం ఉండగా.. కేవలం 20 చోట్ల మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.
* హైటెక్సిటీ సమీపంలోని ఐకియా ఎదురుగా కొన్ని నెలలుగా ఫుట్పాత్పై పైపులు వేశారు. తొలగించాలని సామాజిక మాధ్యమాల్లో అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడం లేదని పాదచారులు వాపోతున్నారు.
మరికొన్నిచోట్ల ఇదీ పరిస్థితి
* సికింద్రాబాద్ ఒలిఫెంటా వంతెన వద్ద కాలిబాటలు పాడైపోయాయి.
*తార్నాక-ఓయూ మార్గంలో నడిచేందుకు వీల్లేకుండా తయారైంది.
* సికింద్రాబాద్-చిలకలగూడ మార్గంలో అడ్డంగా పైపులు పడేశారు.
* దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిలో బస్టాపులు ఏర్పాటయ్యాయి.
* నిమ్స్, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ మధ్య కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి.
* బేగంపేట విమానాశ్రయం ఎదురుగా, పైవంతెన పక్కనున్న కాలిబాట వాహనాల పార్కింగ్, దుకాణాలతో కనుమరుగైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?