నగరాన భారీ వాన
ఏఎస్ రావునగర్లో 3.2 సెం.మీ వర్షపాతం
ఉప్పల్ పరిధిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాలనీల వాసులు అవస్థలు పడ్డారు. నాచారం బాబానగర్లో నీట మునిగిన ఓ వీధిలో జాగ్రత్తగా వెళుతున్న స్థానికులు.
ఈనాడు, హైదరాబాద్: నగరంలో శుక్రవారం రాత్రి వర్షం కుండపోతగా కురిసింది. కుత్బుల్లాపూర్, నాగారం, దమ్మాయిగూడ, కాప్రా, ఏ.ఎస్.రావునగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన బీభత్సం సృష్టించింది. అబ్దుల్లాపూర్మెట్ మండలంలో గంటపాటు వరుణుడు తెరపినివ్వలేదు. ప్రధాన నగరంలోనూ వర్షం ధాటికి రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాలానగర్ రహదారులు, బస్టాండు వద్ద, మూసాపేటలో నీరు పెద్ద ఎత్తున నిలిచింది. అత్యధికంగా రాత్రి 9గంటల సమయానికి ఏఎస్రావునగర్లో 3.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మచ్చబొల్లారంలో 3.15, ఉప్పల్లో 2.68, కుషాయిగూడలో 2.48, తిరుమలగిరిలో 2.43, అల్వాల్లో 2.38, సఫిల్గూడలో 2.05, కుత్బుల్లాపూర్లో 1.8, బాలానగర్లో 1.73, మల్కాజిగిరిలో 1.33సెం.మీ వాన పడింది.
ప్రభావిత ప్రాంతాల్లో అధికారులకు విధులు
వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందుల నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు ముమ్మరం చేసింది. పూడికతీత పనులను వేగవంతం చేశామని, వరదలొచ్చినప్పుడు ప్రమాదకరంగా మారే ప్రాంతాల్లో అధికారులకు విధులు కేటాయించామని జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ‘ఈనాడు’కు తెలిపారు. రూ.36.98 కోట్లతో వర్షాకాల అత్యవసర బృందాలను ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రతి చెరువు వద్ద ఓ అధికారి ఇన్ఛార్జిగా, ఇద్దరు కేర్ టేకర్లుగా ఉండనున్నట్లు ఇంజినీరింగ్ విభాగం వెల్లడించింది. చెరువుల్లోకి వచ్చే వరదను అంచనా వేస్తూ దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేస్తామన్నారు. నాలాల్లో ఏర్పడే అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగించి వరద సాఫీగా సాగేందుకు వర్షాకాల అత్యవసర బృందాలు పనిచేస్తాయన్నారు. జోన్ల వారీగా ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ఇన్ఛార్జులను నియమించారు. పైవంతెనలు, అండర్పాస్లు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణ పనుల వద్ద, నాలా పనుల వద్ద, ఇతర నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లోనూ అధికారులకు జీహెచ్ఎంసీ విధులు కేటాయించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
Serena William: టెన్నిస్కు దూరంగా ఉండాలనుకుంటున్నా: సెరీనా విలియమ్స్
-
Politics News
Shashi Tharoor: విదేశీ పార్లమెంట్లలోనే ప్రధాని ఎక్కువగా మాట్లాడతారు: శశిథరూర్
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
General News
Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
-
General News
Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే.. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకేనా?
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
- Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
- Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్
- Nitish kumar: బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
- Nithiin: అందుకే మా సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ పెట్టాం!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?